Sunday, 28 October 2018

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు



Tuesday, 2 October 2018

*PANCHAYATI SECRETARY HALL TICKETS DOWNLOAD


*PANCHAYATI SECRETARY HALL TICKETS DOWNLOAD*

LINK  : -  http://htno1.tsprrecruitment.in:8081/HallTicket.aspx*

NOTE : - HALL TICKETS CAN BE DOWNLOADED FROM 2nd OCTOBER 2018 TO 8th OCTOBER 2018 ONLY
*




Tuesday, 18 September 2018

VRO QUESTION PAPER 2018

JOBS IN INDIAN TELEPHONE INDUSTRY LIMITED

ఐటీఐ లిమిటెడ్‌లో 110 ఖాళీలు...

బెంగళూరులోని ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ (ఐటీఐ) లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

-మొత్తం పోస్టులు: 110 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ట్రెయినీ (ఏఈఈ )-60
-అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/ యూనివర్సిటీ నుంచి సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, టెలి కమ్యూనికేషన్, ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్, ఐటీ, కెమికల్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
-స్టయిఫండ్: మొదటి ఏడాదికి నెలకు రూ. 15,000/-, రెండో ఏడాది నెలకు రూ. 16,000/- చెల్లిస్తారు. రెండేండ్ల ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయిన తర్వాత గ్రేడ్-2 ఆఫీసర్ స్థాయిలో పే స్కేల్: రూ. 37,673/- ఉంటుంది.
ట్రెయినీ టెక్నికల్ అసిస్టెంట్-50
-అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/బోర్డు నుంచి ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, టెలి కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్/ఐటీ, మెకానికల్, కెమికల్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-స్టయిఫండ్: మొదటి ఏడాదికి నెలకు రూ. 8,000/-, రెండో ఏడాది నెలకు రూ. 8,500/- చెల్లించనున్నారు. రెండేండ్ల ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయిన తర్వాత కేటగిరి-ఈ హోదాలో పే స్కేల్: రూ. 17,537/- చెల్లిస్తారు.
-వయస్సు: ఏఈఈ పోస్టులకు 28 ఏండ్లు, ట్రెయినీ టెక్నికల్ అసిస్టెంట్‌కు 30 ఏండ్లకు మించరాదు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-, ఏఈఈ పోస్టులకు రూ. 300/-
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చిరునామా: DY. GENERAL
MANAGER, ITI LIMITED, REGD
& CORPORATE OFFICE, ITI
BHAVAN, DOORAVANI NAGAR,
BENGALURU 560016
-దరఖాస్తులకు చివరితేదీ:
సెప్టెంబర్ 25
-వెబ్‌సైట్: www.itiltd-india.com

JOBS IN IDPL

ఐడీపీఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌లు...

హైదరాబాద్‌లోని ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐడీపీఎల్) కాంట్రాక్ట్ పద్ధతిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

-పోస్టుల వివరాలు: డిప్యూటీ మేనేజర్ (ఈటీపీ), మేనేజర్/డిప్యూటీ మేనేజర్ (క్యూఏ), ఎగ్జిక్యూటివ్ (సేఫ్టీ), సీనియర్ ఎగ్జిక్యూటివ్ (క్యూసీ), ప్రొడక్షన్‌కెమిస్ట్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్), ఆపరేటర్ (బ్లిస్టర్, ఆటోకోటర్, కాంప్రహెన్షన్, -ఆయిట్‌మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్యూబ్ ఫిల్లింగ్.
-అర్హత: సంబంధిత విభాగంలో పీజీ/బ్యాచిలర్ డిగ్రీ (బీఎస్సీ, బీ ఫార్మసీ) బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత. ఆపరేటర్ పోస్టులకు ఎస్‌ఎస్‌సీతోపాటు సంబంధిత ఐటీఐలో ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 22,000-25,000/-, ఆపరేటర్లకు రూ. 15,000/- (పోస్టులను బట్టి వేర్వేరుగా పే స్కేల్స్ ఉన్నాయి)
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చిరునామా: IDPL New Formulation Block, Balanagar, Hyderabad.
-ఇంటర్వ్యూ తేదీ: సెస్టెంబర్ 27, 28
-వెబ్‌సైట్: www.idplindia.in

JOBS IN IBPS

ఐబీపీఎస్ 7275 క్లరికల్ పోస్టులు...



దేశవ్యాప్తంగా ఉన్న జాతీయబ్యాంకుల్లో ఖాళీగా ఉన్న క్లరికల్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఉమ్మడి రాతపరీక్ష (సీడబ్ల్యూఈ క్లరికల్-VIII) నోటిఫికేషన్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) విడుదల చేసింది.

-మొత్తం ఖాళీలు: 7275
-పోస్టు పేరు: క్లర్క్
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేనాటికి విద్యార్హత సర్టిఫికెట్ చెల్లుబాటు అయ్యేవిధంగా ఉండాలి.
-ఏదైనా సంస్థ నుంచి కంప్యూటర్ సర్టిఫికెట్/డిప్లొమా, డిగ్రీ (కంప్యూటర్ ఆపరేషన్స్/లాంగ్వేజ్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సర్టిఫికెట్) ఉండాలి.
-కేంద్రపాలిత/రాష్ట్ర స్థాయి అధికార భాషలో రాయడం, చదవడం, మాట్లాడటం రావాలి.
-వయస్సు: 2018 సెప్టెంబర్ 1 నాటికి 20 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి.
తెలంగాణలోని బ్యాంకుల్లో ఖాళీలు: 162
(జనరల్-83, ఓబీసీ-41, ఎస్సీ-22, ఎస్టీ-16)
-బ్యాంకుల వారీగా వివరాలు.. అలహాబాద్ బ్యాంక్- 20, బ్యాంక్ ఆఫ్ బరోడా-13, బ్యాంక్ ఆఫ్ ఇండియా-6, కెనరా బ్యాంక్- 60, కార్పొరేషన్ బ్యాంక్- 7, ఇండియన్ బ్యాంక్- 15, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్-5, యూకో బ్యాంక్-8, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 20,
-విజయబ్యాంక్-8.
-ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకుల్లో మొత్తం 167 (జనరల్-84, ఓబీసీ-37, ఎస్సీ-31, ఎస్టీ-15)
-అప్లికేషన్ ఫీజు: రూ. 600/-, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌లు రూ.100/-
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ ప్రిలిమినరీ రాతపరీక్ష, మెయిన్ రాతపరీక్ష ద్వారా.
-ప్రిలిమినరీ పరీక్ష 100, మొయిన్ పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు.
-ప్రిలిమినరీ కేవలం అర్హత పరీక్ష మాత్రమే, మెయిన్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ చేస్తారు.
-ఉమ్మడి రాతపరీక్ష స్కోర్ కార్డ్‌కు 2020 మార్చి 31 వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ గడువు తేదీలోగా ఏదైనా బ్యాంకులో ఖాళీలు ఏర్పడితే ఈ ఉమ్మడిస్కోర్ కార్డుతోనే ఎంపిక చేస్తారు.
-ప్రిలిమినరీ పరీక్షలో రీజనింగ్ ఎబిలిటీ-35, ఇంగ్లిష్ లాంగ్వేజ్-30, న్యూమరికల్ ఎబిలిటీ-35 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
-మెయిన్ పరీక్షలో జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్-50, ఇంగ్లిష్ లాంగ్వేజ్-40, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-50, రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ -50 ప్రశ్నలు ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 18 నుంచి
-చివరితేదీ: అక్టోబర్ 10
-హాల్‌టికెట్ డౌన్‌లోడింగ్(ప్రిలిమినరీ): నవంబర్‌లో ప్రిలిమినరీ ఆన్‌లైన్‌పరీక్ష :
-డిసెంబర్ 8,9 & 15,16
-ప్రిలిమినరీ ఫలితాలు: డిసెంబర్/2019 జనవరిలో
-హాల్ టికెట్ డౌన్‌లోడింగ్ (మొయిన్): 2019 జనవరిలో
-మెయిన్ ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 2019 జనవరి 20
-మొయిన్ రాతపరీక్ష ఫలితాలు: 2019 ఏప్రిల్‌లో
-వెబ్‌సైట్: www.ibps.in

JOBS In ESIC

ఈఎస్‌ఐసీలో 529 ఖాళీలు...

న్యూఢిల్లీలోని భారత కార్మిక మంత్రిత్వశాఖకు చెందిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) ఖాళీగా ఉన్న ఎస్‌ఎస్‌వో/ మేనేజర్ / సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

-పోస్టు పేరు: సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్/ గ్రేడ్2 మేనేజర్ / సూపరింటెండెంట్
-మొత్తం పోస్టులు: 529 (జనరల్-294, ఓబీసీ-141, ఎస్సీ-82, ఎస్టీ-22)
గమనిక: ఈఎస్‌ఐసీ 2014 జనవరి 6న విడుదల చేసిన ప్రకటనకు అనుగుణంగా తాజా నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు దరఖాస్తు చేసుకున్నవారు ప్రస్తుతం ఫీజు చెల్లించనవసరం లేదు.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. కామర్స్/లా/మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. ప్రభుత్వ సంస్థ/కార్పొరేషన్ /లోకల్ బాడీ/షెడ్యూల్డ్ బ్యాంక్‌లలో మూడేండ్ల పాటు పనిచేసి ఉండటం అభిలషణీయం.
-వయస్సు: 2018 అక్టోబర్ 5 నాటికి 21 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 44,900/-
(7వ వేతన పే స్కేల్ అనుసరించి)
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/- (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు రూ. 250/-)
-ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ ద్వారా
-ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో ఇంగ్లిష్ లాంగ్వేజ్-30, రీజనింగ్ ఎబిలిటీ-35, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-35 అంశాల నుంచి ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
-సమయం: 60 నిమిషాల్లో పరీక్ష
పూర్తిచేయాలి.
-మెయిన్ ఎగ్జామినేషన్‌లో రీజనింగ్/ఇంటెలిజెన్స్-40, జనరల్/ఎకానమీ/ఫైనాన్షియల్/ ఇన్సూరెన్స్ అవేర్‌నెస్-40, ఇంగ్లిష్ లాంగ్వేజ్-30, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-40 అంశాల నుంచి ప్రతి ప్రశ్నకు ఒక మార్కు /ఒకటిన్నర మార్కు చొప్పున మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. 120 నిమిషాల్లో పరీక్ష పూర్తిచేయాలి.
-కంప్యూటర్ స్కిల్ టెస్ట్‌లో పవర్‌పాయింట్స్ ైస్లెడ్స్-10, ఎంఎస్ వర్డ్-20, ఎంఎస్ ఎక్సెల్-20 మార్కులు డిస్క్రిప్టివ్ టెస్ట్ (రెండు ప్రశ్నలు)-50 మార్కులకు ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ: అక్టోబర్ 5
-వెబ్‌సైట్: www.esic.nic.in

JOBS IN BSNL

బీఎస్‌ఎన్‌ఎల్‌లో 198 జేటీవోలు...



భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్)లో గేట్-2019 స్కోర్‌తో జేటీవో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

-పోస్టు: జూనియర్ టెలికం ఆఫీసర్ (ఎలక్ట్రికల్ & సివిల్)
-ఖాళీల సంఖ్య -198
-పేస్కేల్: రూ. 16,400-40,500/-
-అర్హత: బీఈ/బీటెక్‌లో సివిల్/ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో ఉత్తీర్ణత లేదా ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తూ గేట్ -2019 పరీక్షలో సంబంధిత పేపర్‌కు
దరఖాస్తు చేసుకుని ఉండాలి.
-ఎంపిక: గేట్-2019 స్కోర్‌తో
-నోట్: స్పెషల్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈ పోస్టులను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు.

-పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: http://www.bsnl.co.in

JOBS IN VIJAYA BANK

విజయాబ్యాంకులో 330 పోస్టులు...



భారత ప్రభుత్వ పరిధిలోని విజయాబ్యాంకులో ప్రొబేషనరీ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

-పోస్టు: ప్రొబేషనరీ అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) (జేఎంజీ-1 స్కేల్)
-మొత్తం ఖాళీలు: 330 వీటిలో జనరల్-167, ఓబీసీ-89, ఎస్సీ-49, ఎస్టీ-25)
-వయస్సు: 2018, ఆగస్టు 1 నాటికి 21-30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీ (ఎన్‌ఎల్‌సీ)లకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఎంబీఏ/పీజీడీబీఎం లేదా పీజీడీఎం లేదా పీజీబీఎం లేదా తత్సమాన కోర్సులో ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో ఫుల్‌టైం కోర్సు ఉత్తీర్ణత. లేదా పీజీలో కామర్స్/సైన్స్ లేదా ఎకనామిక్స్/లా లేదా సీఏ/ఐసీడబ్ల్యూఏ లేదా కంపెనీ సెక్రటరీ (సీఎస్) ఉండాలి.
-పేస్కేల్: రూ. 23,700-42,020/- వీటికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఎల్‌టీసీ తదితర అలవెన్సులు ఇస్తారు.
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, వ్యక్తిగత ఇంటర్వ్యూ
-ఆన్‌లైన్ ఎగ్జామ్: ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్ (బ్యాంకింగ్ స్పెషల్), ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌ల నుంచి 50 ప్రశ్నల చొప్పున మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు.
-పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కుల కోతవిధిస్తారు.
-పరీక్ష కాలవ్యవధి:120 నిమిషాలు.
-ఆన్‌లైన్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా రిజర్వేషన్‌లవారీగా (ఎస్సీ/ఎస్టీ,ఓబీసీ, జనరల్)
ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
-ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.100/- , ఇతరులకు రూ. 600/-
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడతో సహా దేశవ్యాప్తంగా మొత్తం 23 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 27
-వెబ్‌సైట్: www.vijayabank.com

Monday, 17 September 2018

Panchayat Secretary Exam Postponed

పంచాయతీ సెక్రెటరీ పరీక్ష వాయిదా...

పంచాయతీ సెక్రటరీ పరీక్ష వాయిదా అక్టోబర్ 4న జరగాల్సిన పరీక్ష 10వ తేదీ కి వాయిదా వేయడం జరిగింది

Wednesday, 12 September 2018

11 Lakhs Applied FOR VRO

వీఆర్వో పోస్టులకు 11లక్షలమంది దరఖాస్తు.. 16న పరీక్షకు అంతా సిద్ధం


 ఈనెల (సెప్టెంబర్) 16న వీఆర్వో పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని చెప్పారు TSPSC సెక్రటరీ వాణి ప్రసాద్. జూన్2 వ తేదీన విడుదల చేసిన‌ వీఆర్వో పోస్టులకు పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చిందన్నారు. పదహారున పొద్దున పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు పరీక్ష ఉంటుందన్నారు. దాదాపు 11 లక్షల మంది  దరఖాస్తు చేసుకున్నారని… ఇప్పటి వరకు ఇన్ని లక్షల మంది ఏ పరీక్షకు దరఖాస్తు  చేసుకోలేదని చెప్పారామె.
11 లక్షల మంది అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ల సహకారంతో అన్ని జిల్లాలో సెంటర్స్ ఏర్పాటు చేశామని వాణిప్రసాద్ చెప్పారు. రాష్ట్రమంతటా 2వేల 945 సెంటర్స్ సిద్ధం చేశామన్నారు. HMDA పరిధిలో 3 లక్షల మంది పరీక్ష రాస్తున్నారని అన్నారు. హైదరాబాద్ లో‌ అత్యధిక మంది పరీక్ష రాయడానికి మొదటి ప్రయారిటీ ఇచ్చారని చెప్పిన వాణి ప్రసాద్… పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పరీక్షకు హాజరుకానుండటంతో అన్ని శాఖల సహకారం తీసుకుంటున్నామన్నారు.

ఇప్పటి వరకు 7 లక్షల మంది హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారని అన్నారు. పరీక్ష రాసిన తరువాత స్కానింగ్ కాపీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుందని చెప్పారు. హాల్ టికెట్ ను ముందే డౌన్ లోడ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Tuesday, 11 September 2018

Date Extended For Application of Panchayat Secretary




హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శి దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. నిజానికి ఫీజు చెల్లింపుకు ఈరోజే చివరి తేదీ, దరఖాస్తుకు రేపు చివరి తేదీ. దరఖాస్తులో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం గడువును పొడిగించాలని నిర్ణయం తీసుకున్నది. ఫీజు చెల్లింపుకు ఈనెల 13 వ తేదీ, దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 14 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి జూపల్లి కృష్ణారావు సూచనలతో గడువు పొడిగిస్తూ నియామక ప్రక్రియ కమిటీ కన్వీనర్ నీతూ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Saturday, 8 September 2018

NO CHANGES IN POLICE RECRUITMENT

యథావిధిగా పోలీస్ కొలువుల భర్తీ






-టీఎస్‌ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు
-నేడు కమ్యూనికేషన్ ఎస్సై, ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష
-ఏర్పాట్లు పూర్తిచేసిన నియామక బోర్డు

తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామకమండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) చేపట్టిన పోలీస్ కొలువుల భర్తీప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని టీఎస్‌ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే ఎస్సై ప్రిలిమ్స్ పరీక్షను పూర్తిచేశామని చెప్పారు. ఆదివారం కమ్యూనికేషన్ ఎస్సై, ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లుచేశామని ఆయన శనివారం నమస్తే తెలంగాణకు తెలిపారు. పోలీస్‌శాఖలోని 18,428 పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి మే 31న నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటికీ.. ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చినందున పోస్టుల భర్తీ ప్రక్రియకు ఎలాంటి అవరోధం ఉండబోదని భావిస్తున్నట్టు శ్రీనివాసరావు వెల్లడించారు. ఫిజికల్ టెస్ట్‌లను అక్టోబర్, నవంబర్‌లో నిర్వహించాలనుకుంటున్నామని, ప్రాథమిక రాత పరీక్షల అనంతరం తేదీలను ఖరారు చేస్తామని తెలిపారు. ఈ నెల 30న కానిస్టేబుల్ ప్రాథమిక రాతపరీక్ష ఉంటుందని ఆయన తెలిపారు.
నేటి ప్రిలిమ్స్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ఆదివారం నిర్వహించనున్న కమ్యూనికేషన్ ఎస్సై, ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై ప్రిలిమ్స్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు టీఎస్‌ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. 29 కమ్యూనికేషన్ ఎస్సై (ఎస్సై ఐటీ అండ్ కమ్యూనికేషన్) పోస్టుల భర్తీ కోసం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్న పరీక్షకు 14 వేలమంది అభ్యర్థులు హాజరుకానున్నారని, మొత్తం 20 కేంద్రాలను ఏర్పాటుచేశామని చెప్పారు. 26 ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై పోస్టుల కోసం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహించనున్న ప్రిలిమ్స్ పరీక్షకు 7,700 మంది అభ్యర్థులు హాజరవుతారని పేర్కొన్నారు. వీరికోసం బంజారాహిల్స్‌లో రెండు, ఆసిఫ్‌నగర్‌లో 3, మొయినాబాద్‌లో ఆరు కలిపి మొత్తం 11 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లుచేసినట్టు ఆయన వివరించారు.

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు