Wednesday 19 September 2018

Tuesday 18 September 2018

VRO QUESTION PAPER 2018

JOBS IN INDIAN TELEPHONE INDUSTRY LIMITED

ఐటీఐ లిమిటెడ్‌లో 110 ఖాళీలు...

బెంగళూరులోని ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ (ఐటీఐ) లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

-మొత్తం పోస్టులు: 110 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ట్రెయినీ (ఏఈఈ )-60
-అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/ యూనివర్సిటీ నుంచి సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, టెలి కమ్యూనికేషన్, ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్, ఐటీ, కెమికల్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
-స్టయిఫండ్: మొదటి ఏడాదికి నెలకు రూ. 15,000/-, రెండో ఏడాది నెలకు రూ. 16,000/- చెల్లిస్తారు. రెండేండ్ల ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయిన తర్వాత గ్రేడ్-2 ఆఫీసర్ స్థాయిలో పే స్కేల్: రూ. 37,673/- ఉంటుంది.
ట్రెయినీ టెక్నికల్ అసిస్టెంట్-50
-అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/బోర్డు నుంచి ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, టెలి కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్/ఐటీ, మెకానికల్, కెమికల్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-స్టయిఫండ్: మొదటి ఏడాదికి నెలకు రూ. 8,000/-, రెండో ఏడాది నెలకు రూ. 8,500/- చెల్లించనున్నారు. రెండేండ్ల ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయిన తర్వాత కేటగిరి-ఈ హోదాలో పే స్కేల్: రూ. 17,537/- చెల్లిస్తారు.
-వయస్సు: ఏఈఈ పోస్టులకు 28 ఏండ్లు, ట్రెయినీ టెక్నికల్ అసిస్టెంట్‌కు 30 ఏండ్లకు మించరాదు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-, ఏఈఈ పోస్టులకు రూ. 300/-
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చిరునామా: DY. GENERAL
MANAGER, ITI LIMITED, REGD
& CORPORATE OFFICE, ITI
BHAVAN, DOORAVANI NAGAR,
BENGALURU 560016
-దరఖాస్తులకు చివరితేదీ:
సెప్టెంబర్ 25
-వెబ్‌సైట్: www.itiltd-india.com

JOBS IN IDPL

ఐడీపీఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌లు...

హైదరాబాద్‌లోని ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐడీపీఎల్) కాంట్రాక్ట్ పద్ధతిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

-పోస్టుల వివరాలు: డిప్యూటీ మేనేజర్ (ఈటీపీ), మేనేజర్/డిప్యూటీ మేనేజర్ (క్యూఏ), ఎగ్జిక్యూటివ్ (సేఫ్టీ), సీనియర్ ఎగ్జిక్యూటివ్ (క్యూసీ), ప్రొడక్షన్‌కెమిస్ట్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్), ఆపరేటర్ (బ్లిస్టర్, ఆటోకోటర్, కాంప్రహెన్షన్, -ఆయిట్‌మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్యూబ్ ఫిల్లింగ్.
-అర్హత: సంబంధిత విభాగంలో పీజీ/బ్యాచిలర్ డిగ్రీ (బీఎస్సీ, బీ ఫార్మసీ) బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత. ఆపరేటర్ పోస్టులకు ఎస్‌ఎస్‌సీతోపాటు సంబంధిత ఐటీఐలో ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 22,000-25,000/-, ఆపరేటర్లకు రూ. 15,000/- (పోస్టులను బట్టి వేర్వేరుగా పే స్కేల్స్ ఉన్నాయి)
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చిరునామా: IDPL New Formulation Block, Balanagar, Hyderabad.
-ఇంటర్వ్యూ తేదీ: సెస్టెంబర్ 27, 28
-వెబ్‌సైట్: www.idplindia.in

JOBS IN IBPS

ఐబీపీఎస్ 7275 క్లరికల్ పోస్టులు...



దేశవ్యాప్తంగా ఉన్న జాతీయబ్యాంకుల్లో ఖాళీగా ఉన్న క్లరికల్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఉమ్మడి రాతపరీక్ష (సీడబ్ల్యూఈ క్లరికల్-VIII) నోటిఫికేషన్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) విడుదల చేసింది.

-మొత్తం ఖాళీలు: 7275
-పోస్టు పేరు: క్లర్క్
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేనాటికి విద్యార్హత సర్టిఫికెట్ చెల్లుబాటు అయ్యేవిధంగా ఉండాలి.
-ఏదైనా సంస్థ నుంచి కంప్యూటర్ సర్టిఫికెట్/డిప్లొమా, డిగ్రీ (కంప్యూటర్ ఆపరేషన్స్/లాంగ్వేజ్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సర్టిఫికెట్) ఉండాలి.
-కేంద్రపాలిత/రాష్ట్ర స్థాయి అధికార భాషలో రాయడం, చదవడం, మాట్లాడటం రావాలి.
-వయస్సు: 2018 సెప్టెంబర్ 1 నాటికి 20 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి.
తెలంగాణలోని బ్యాంకుల్లో ఖాళీలు: 162
(జనరల్-83, ఓబీసీ-41, ఎస్సీ-22, ఎస్టీ-16)
-బ్యాంకుల వారీగా వివరాలు.. అలహాబాద్ బ్యాంక్- 20, బ్యాంక్ ఆఫ్ బరోడా-13, బ్యాంక్ ఆఫ్ ఇండియా-6, కెనరా బ్యాంక్- 60, కార్పొరేషన్ బ్యాంక్- 7, ఇండియన్ బ్యాంక్- 15, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్-5, యూకో బ్యాంక్-8, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 20,
-విజయబ్యాంక్-8.
-ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకుల్లో మొత్తం 167 (జనరల్-84, ఓబీసీ-37, ఎస్సీ-31, ఎస్టీ-15)
-అప్లికేషన్ ఫీజు: రూ. 600/-, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌లు రూ.100/-
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ ప్రిలిమినరీ రాతపరీక్ష, మెయిన్ రాతపరీక్ష ద్వారా.
-ప్రిలిమినరీ పరీక్ష 100, మొయిన్ పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు.
-ప్రిలిమినరీ కేవలం అర్హత పరీక్ష మాత్రమే, మెయిన్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ చేస్తారు.
-ఉమ్మడి రాతపరీక్ష స్కోర్ కార్డ్‌కు 2020 మార్చి 31 వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ గడువు తేదీలోగా ఏదైనా బ్యాంకులో ఖాళీలు ఏర్పడితే ఈ ఉమ్మడిస్కోర్ కార్డుతోనే ఎంపిక చేస్తారు.
-ప్రిలిమినరీ పరీక్షలో రీజనింగ్ ఎబిలిటీ-35, ఇంగ్లిష్ లాంగ్వేజ్-30, న్యూమరికల్ ఎబిలిటీ-35 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
-మెయిన్ పరీక్షలో జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్-50, ఇంగ్లిష్ లాంగ్వేజ్-40, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-50, రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ -50 ప్రశ్నలు ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 18 నుంచి
-చివరితేదీ: అక్టోబర్ 10
-హాల్‌టికెట్ డౌన్‌లోడింగ్(ప్రిలిమినరీ): నవంబర్‌లో ప్రిలిమినరీ ఆన్‌లైన్‌పరీక్ష :
-డిసెంబర్ 8,9 & 15,16
-ప్రిలిమినరీ ఫలితాలు: డిసెంబర్/2019 జనవరిలో
-హాల్ టికెట్ డౌన్‌లోడింగ్ (మొయిన్): 2019 జనవరిలో
-మెయిన్ ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 2019 జనవరి 20
-మొయిన్ రాతపరీక్ష ఫలితాలు: 2019 ఏప్రిల్‌లో
-వెబ్‌సైట్: www.ibps.in

JOBS In ESIC

ఈఎస్‌ఐసీలో 529 ఖాళీలు...

న్యూఢిల్లీలోని భారత కార్మిక మంత్రిత్వశాఖకు చెందిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) ఖాళీగా ఉన్న ఎస్‌ఎస్‌వో/ మేనేజర్ / సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

-పోస్టు పేరు: సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్/ గ్రేడ్2 మేనేజర్ / సూపరింటెండెంట్
-మొత్తం పోస్టులు: 529 (జనరల్-294, ఓబీసీ-141, ఎస్సీ-82, ఎస్టీ-22)
గమనిక: ఈఎస్‌ఐసీ 2014 జనవరి 6న విడుదల చేసిన ప్రకటనకు అనుగుణంగా తాజా నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు దరఖాస్తు చేసుకున్నవారు ప్రస్తుతం ఫీజు చెల్లించనవసరం లేదు.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. కామర్స్/లా/మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. ప్రభుత్వ సంస్థ/కార్పొరేషన్ /లోకల్ బాడీ/షెడ్యూల్డ్ బ్యాంక్‌లలో మూడేండ్ల పాటు పనిచేసి ఉండటం అభిలషణీయం.
-వయస్సు: 2018 అక్టోబర్ 5 నాటికి 21 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 44,900/-
(7వ వేతన పే స్కేల్ అనుసరించి)
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/- (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు రూ. 250/-)
-ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ ద్వారా
-ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో ఇంగ్లిష్ లాంగ్వేజ్-30, రీజనింగ్ ఎబిలిటీ-35, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-35 అంశాల నుంచి ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
-సమయం: 60 నిమిషాల్లో పరీక్ష
పూర్తిచేయాలి.
-మెయిన్ ఎగ్జామినేషన్‌లో రీజనింగ్/ఇంటెలిజెన్స్-40, జనరల్/ఎకానమీ/ఫైనాన్షియల్/ ఇన్సూరెన్స్ అవేర్‌నెస్-40, ఇంగ్లిష్ లాంగ్వేజ్-30, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-40 అంశాల నుంచి ప్రతి ప్రశ్నకు ఒక మార్కు /ఒకటిన్నర మార్కు చొప్పున మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. 120 నిమిషాల్లో పరీక్ష పూర్తిచేయాలి.
-కంప్యూటర్ స్కిల్ టెస్ట్‌లో పవర్‌పాయింట్స్ ైస్లెడ్స్-10, ఎంఎస్ వర్డ్-20, ఎంఎస్ ఎక్సెల్-20 మార్కులు డిస్క్రిప్టివ్ టెస్ట్ (రెండు ప్రశ్నలు)-50 మార్కులకు ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ: అక్టోబర్ 5
-వెబ్‌సైట్: www.esic.nic.in

JOBS IN BSNL

బీఎస్‌ఎన్‌ఎల్‌లో 198 జేటీవోలు...



భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్)లో గేట్-2019 స్కోర్‌తో జేటీవో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

-పోస్టు: జూనియర్ టెలికం ఆఫీసర్ (ఎలక్ట్రికల్ & సివిల్)
-ఖాళీల సంఖ్య -198
-పేస్కేల్: రూ. 16,400-40,500/-
-అర్హత: బీఈ/బీటెక్‌లో సివిల్/ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో ఉత్తీర్ణత లేదా ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తూ గేట్ -2019 పరీక్షలో సంబంధిత పేపర్‌కు
దరఖాస్తు చేసుకుని ఉండాలి.
-ఎంపిక: గేట్-2019 స్కోర్‌తో
-నోట్: స్పెషల్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈ పోస్టులను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు.

-పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: http://www.bsnl.co.in

JOBS IN VIJAYA BANK

విజయాబ్యాంకులో 330 పోస్టులు...



భారత ప్రభుత్వ పరిధిలోని విజయాబ్యాంకులో ప్రొబేషనరీ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

-పోస్టు: ప్రొబేషనరీ అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) (జేఎంజీ-1 స్కేల్)
-మొత్తం ఖాళీలు: 330 వీటిలో జనరల్-167, ఓబీసీ-89, ఎస్సీ-49, ఎస్టీ-25)
-వయస్సు: 2018, ఆగస్టు 1 నాటికి 21-30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీ (ఎన్‌ఎల్‌సీ)లకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఎంబీఏ/పీజీడీబీఎం లేదా పీజీడీఎం లేదా పీజీబీఎం లేదా తత్సమాన కోర్సులో ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో ఫుల్‌టైం కోర్సు ఉత్తీర్ణత. లేదా పీజీలో కామర్స్/సైన్స్ లేదా ఎకనామిక్స్/లా లేదా సీఏ/ఐసీడబ్ల్యూఏ లేదా కంపెనీ సెక్రటరీ (సీఎస్) ఉండాలి.
-పేస్కేల్: రూ. 23,700-42,020/- వీటికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఎల్‌టీసీ తదితర అలవెన్సులు ఇస్తారు.
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, వ్యక్తిగత ఇంటర్వ్యూ
-ఆన్‌లైన్ ఎగ్జామ్: ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్ (బ్యాంకింగ్ స్పెషల్), ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌ల నుంచి 50 ప్రశ్నల చొప్పున మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు.
-పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కుల కోతవిధిస్తారు.
-పరీక్ష కాలవ్యవధి:120 నిమిషాలు.
-ఆన్‌లైన్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా రిజర్వేషన్‌లవారీగా (ఎస్సీ/ఎస్టీ,ఓబీసీ, జనరల్)
ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
-ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.100/- , ఇతరులకు రూ. 600/-
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడతో సహా దేశవ్యాప్తంగా మొత్తం 23 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 27
-వెబ్‌సైట్: www.vijayabank.com

Monday 17 September 2018

Panchayat Secretary Exam Postponed

పంచాయతీ సెక్రెటరీ పరీక్ష వాయిదా...

పంచాయతీ సెక్రటరీ పరీక్ష వాయిదా అక్టోబర్ 4న జరగాల్సిన పరీక్ష 10వ తేదీ కి వాయిదా వేయడం జరిగింది

Wednesday 12 September 2018

11 Lakhs Applied FOR VRO

వీఆర్వో పోస్టులకు 11లక్షలమంది దరఖాస్తు.. 16న పరీక్షకు అంతా సిద్ధం


 ఈనెల (సెప్టెంబర్) 16న వీఆర్వో పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని చెప్పారు TSPSC సెక్రటరీ వాణి ప్రసాద్. జూన్2 వ తేదీన విడుదల చేసిన‌ వీఆర్వో పోస్టులకు పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చిందన్నారు. పదహారున పొద్దున పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు పరీక్ష ఉంటుందన్నారు. దాదాపు 11 లక్షల మంది  దరఖాస్తు చేసుకున్నారని… ఇప్పటి వరకు ఇన్ని లక్షల మంది ఏ పరీక్షకు దరఖాస్తు  చేసుకోలేదని చెప్పారామె.
11 లక్షల మంది అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ల సహకారంతో అన్ని జిల్లాలో సెంటర్స్ ఏర్పాటు చేశామని వాణిప్రసాద్ చెప్పారు. రాష్ట్రమంతటా 2వేల 945 సెంటర్స్ సిద్ధం చేశామన్నారు. HMDA పరిధిలో 3 లక్షల మంది పరీక్ష రాస్తున్నారని అన్నారు. హైదరాబాద్ లో‌ అత్యధిక మంది పరీక్ష రాయడానికి మొదటి ప్రయారిటీ ఇచ్చారని చెప్పిన వాణి ప్రసాద్… పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పరీక్షకు హాజరుకానుండటంతో అన్ని శాఖల సహకారం తీసుకుంటున్నామన్నారు.

ఇప్పటి వరకు 7 లక్షల మంది హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారని అన్నారు. పరీక్ష రాసిన తరువాత స్కానింగ్ కాపీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుందని చెప్పారు. హాల్ టికెట్ ను ముందే డౌన్ లోడ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Tuesday 11 September 2018

Date Extended For Application of Panchayat Secretary




హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శి దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. నిజానికి ఫీజు చెల్లింపుకు ఈరోజే చివరి తేదీ, దరఖాస్తుకు రేపు చివరి తేదీ. దరఖాస్తులో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం గడువును పొడిగించాలని నిర్ణయం తీసుకున్నది. ఫీజు చెల్లింపుకు ఈనెల 13 వ తేదీ, దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 14 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి జూపల్లి కృష్ణారావు సూచనలతో గడువు పొడిగిస్తూ నియామక ప్రక్రియ కమిటీ కన్వీనర్ నీతూ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Saturday 8 September 2018

NO CHANGES IN POLICE RECRUITMENT

యథావిధిగా పోలీస్ కొలువుల భర్తీ






-టీఎస్‌ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు
-నేడు కమ్యూనికేషన్ ఎస్సై, ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష
-ఏర్పాట్లు పూర్తిచేసిన నియామక బోర్డు

తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామకమండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) చేపట్టిన పోలీస్ కొలువుల భర్తీప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని టీఎస్‌ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే ఎస్సై ప్రిలిమ్స్ పరీక్షను పూర్తిచేశామని చెప్పారు. ఆదివారం కమ్యూనికేషన్ ఎస్సై, ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లుచేశామని ఆయన శనివారం నమస్తే తెలంగాణకు తెలిపారు. పోలీస్‌శాఖలోని 18,428 పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి మే 31న నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటికీ.. ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చినందున పోస్టుల భర్తీ ప్రక్రియకు ఎలాంటి అవరోధం ఉండబోదని భావిస్తున్నట్టు శ్రీనివాసరావు వెల్లడించారు. ఫిజికల్ టెస్ట్‌లను అక్టోబర్, నవంబర్‌లో నిర్వహించాలనుకుంటున్నామని, ప్రాథమిక రాత పరీక్షల అనంతరం తేదీలను ఖరారు చేస్తామని తెలిపారు. ఈ నెల 30న కానిస్టేబుల్ ప్రాథమిక రాతపరీక్ష ఉంటుందని ఆయన తెలిపారు.
నేటి ప్రిలిమ్స్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ఆదివారం నిర్వహించనున్న కమ్యూనికేషన్ ఎస్సై, ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై ప్రిలిమ్స్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు టీఎస్‌ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. 29 కమ్యూనికేషన్ ఎస్సై (ఎస్సై ఐటీ అండ్ కమ్యూనికేషన్) పోస్టుల భర్తీ కోసం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్న పరీక్షకు 14 వేలమంది అభ్యర్థులు హాజరుకానున్నారని, మొత్తం 20 కేంద్రాలను ఏర్పాటుచేశామని చెప్పారు. 26 ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై పోస్టుల కోసం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహించనున్న ప్రిలిమ్స్ పరీక్షకు 7,700 మంది అభ్యర్థులు హాజరవుతారని పేర్కొన్నారు. వీరికోసం బంజారాహిల్స్‌లో రెండు, ఆసిఫ్‌నగర్‌లో 3, మొయినాబాద్‌లో ఆరు కలిపి మొత్తం 11 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లుచేసినట్టు ఆయన వివరించారు.

MULKI RULES AND MULKI MOVEMENT

ముల్కీ రూల్స్, ముల్కీ ఉద్యమం


1) ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పంచ సూత్ర పథకాన్ని ఏ రోజున ప్రకటించింది ?
ఎ) 1972 నవంబర్ 28
బి) 1972 నవంబర్ 26
సి) 1972 నవంబర్ 27 #
డి) 1972 నవంబర్ 29
2) ఏ ఉద్యమాన్ని అణచివేయుటకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ ఆరు సూత్రాల పథకం ప్రవేశపెట్టింది ?
ఎ) సాయుధ పోరాటం
బి) జై ఆంధ్ర ఉద్యమం #
సి) నక్సలైట్ ఉద్యమం
డి) పైవేవి కావు
3) ముల్కీ బదులుగా జోన్లను ప్రవేశపెడుతూ సీమాంధ్ర ఉద్యోగులకు రిజర్వేషన్లను కల్పించేందుకు రాష్ట్రపతికి అధికారం ఇస్తున్న ఆర్టికల్ ఏది ?
ఎ) 371(బి)
బి) 371(సి)
సి) 371(ఎ)
డి) 371(డి) #
4) 1952 ముల్కీ ఉద్యమ సమయంలో ఉథావ్ రావు సంపాదకత్వంలో వచ్చిన పత్రిక ఏది ?
ఎ) పాయం #
బి) ప్రజాతంత్ర
సి) గోలకొండ
డి) మాభూమి
5) ముల్కీ ఉద్యమంలో భాగంగా హైదరాబాద్ లో పి.డి. యాక్ట్ క్రింద అరెస్ట్ అయిన శాసనసభ్యుడు ఎవరు ?
ఎ) పూల్ చంద్ గాంధీ
బి) జి.ఎస్. మేల్కొటె
సి) సయ్యద్ అక్తర్ హుస్సేన్ #
డి) నవాబ్ జంగ్ బహదూర్
6) ముల్కీ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమయ్యింది ?
ఎ) 1954
బి) 1952 #
సి) 1956
డి) 1950
7) 1952 ముల్కీ ఉద్యమం ఎవరి ఆధ్వర్యంలో ప్రారంభం అయినది ?
ఎ) మదన్ మోహన్
బి) ప్రొ.జయశంకర్
సి) టి.హయగ్రీవాచారి
డి) జి. రామాచారి #
8) ముల్కీ ఉద్యమం కారణంగా సాలార్ జంగ్ పదవిని కోల్పోయిన ప్రధాని ?
ఎ) సాలార్ జంగ్-II #
బి) సాలార్ జంగ్-III
సి) సాలార్ జంగ్-I
డి) పైవారందరూ
9) ఎపిఎన్ఇబిలోని ఉద్యోగులకు కూడా ముల్కీ నిబంధనలు అమలు చేయాలని ఏ థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యోగులు హైకోర్టులో కేసు వేశారు ?
ఎ) కాకతీయ థర్మల్ ప్లాంట్
బి) కోత్తగూడెం థర్మల్ ప్లాంట్ #
సి) పై రెండూ
డి) పైవేవి కావు
10) 1971 ఫబ్రవరి 14న సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలపై ఇచ్చిన తీర్పులో ఏ ఫర్మానాలో పేర్కోన్న నిబంధలను అమలులోకి వచ్చాయి ?
ఎ) 1868 ఫర్మానా
బి) 1919 ఫర్మానా
సి) 1955 ఫర్మానా
డి) 1949 ఫర్మానా #
11) ముల్కీ నిబంధనలు ఆరంభంలో నియమావళికి మాత్రమే వర్తిస్తుంది తప్ప అనంతరం ప్రమేషన్, సీనియారిటీ, రివర్షన్, రిట్రెంచ్ మెంట్లకు కాదని హైకోర్టు ఎప్పుడు తీర్పు ఇచ్చింది ?
ఎ) 1973 జూన్ 12
బి) 1973 జూలై 11
సి) 1973 జూన్ 11 #
డి) 1973 జూలై 12
12) 1952 ముల్కీ ఉద్యమం ప్రారంభం అయినపుడు వరంగల్ కలెక్టర్ ఎవరు ?
ఎ) రామేశ్వర్ దేశ్ పాండే
బి) గోవిందరావు దేశ్ పాండే #
సి) వి.డి. దేశ్ పాండే
డి) ఎవరూ కాదు
13) 1952 ముల్కీ ఉద్యమంలో వరంగల్ లో ఎప్పుడు విద్యార్థులపై లాఠీచార్జీ జరిగింది ?
ఎ) 1952 ఆగస్టు 17
బి) 1952 ఆగస్టు 30
సి) 1952 ఆగస్టు 29
డి) 1952 ఆగస్టు 28 #
14) 1972లో సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలపై తీర్పు వ్యక్తపరిచినపుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు ?
ఎ) జలగం వెంగళరావు
బి) టి.జంగయ్య
సి) పి.వి.నరసింహరావు #
డి) కాసు బ్రహ్మానందరెడ్డి
15) ఇంధిరాగాంధీ ప్రకటించిన అష్టసూత్ర పథకాన్ని లక్ష్యపెట్టవలసిన అవసరం లేదని పేర్కోన్న తెలంగాణ ప్రజాసమితి తాత్కాలిక అధ్యక్షులు ఎవరు ?
ఎ) మదన్ మోహన్
బి) శ్రీధర్ రెడ్డి
సి) సదాలక్ష్మీ #
డి) మర్రి చెన్నారెడ్డి
16) హైదరాబాద్ లో 1952 ఆగస్టు 27న మొట్టమొదటి జరిగిన ముల్కీ సభకు అధ్యక్షుడిగా వ్యవహరించింది ఎవరు ?
ఎ) బుచ్చయ్య
బి) డా. తిమ్మరాజు #
సి) గోపాలరావు ఎక్సెటి
డి) కొండా వెంకటరంగారెడ్డి
17) 1952 ముల్కీ ఉద్యమం ప్రారంభం కావటానికి వరంగల్ లో 180 మంది ఉపాధ్యాయులకు బదిలీ చేసిన డివిజనల్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఎవరు ?
ఎ) పార్ధసారధి #
బి) జి. రామాచారి
సి) టి. హయగ్రీవాచారి
డి) ఎవరూ కాదు
18) ముల్కీ ఉద్యమ సమయంలో ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఏ రోజున ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు ?
ఎ) 1952 సెప్టెంబర్ 5
బి) 1952 సెప్టెంబర్ 3
సి) 1952 సెప్టెంబర్ 2
డి) 1952 సెప్టెంబర్ 4 #
19) లోక్ సభ ముల్కీ నిబంధనలకు అడ్డు తగిలిన నాయకులు ఎవరు ?
ఎ) నీలం సంజీవరెడ్డి
బి) వెంకట సుబ్బయ్య
సి) ఎం. సుదర్శన్ #
డి) ఎస్.ఎం. జోషి
20) ముల్కీ అనగా అర్ధం ఏమిటి ?
ఎ) స్థానికేతరుడు
బి) స్థానికుడు #
సి) హైదరాబాదీ
డి) ఉర్దూ వచ్చినవారు
21) 1952 సెప్టెంబర్ లో తెలంగాణాలో పెద్ద ఎత్తున జరిగిన ఉద్యమం పేరు ఏమిటి ?
ఎ) ముల్కీ ఉద్యమం
బి) నాన్ ముల్కీ ఉద్యమం
సి) గైర్ ముల్కీ ఉద్యమం #
డి) పైవేవి కావు
22) ముల్కీ గైర్ ముల్కీ అనే సమస్య ఎవరి కాలం నుండి ఉంది ?
ఎ) అసఫ్ జాహీలు
బి) మొగలులు
సి) బహమనీలు #
డి) కుతుబ్ షాహీలు
23) ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమైనవి. ఇవి చెల్లవని చెప్పిన న్యాయమూర్తి ఎవరు ?
ఎ) కొండా వెంకటరంగారెడ్ డి
బి) కొండామాధవరెడ్డి #
సి) డా. తిమ్మరాజు
డి) ఎవరూ కాదు
24) ఇందిరాగాంధీ పంచసూత్ర పథకాన్ని ముల్కీ రూల్స్ తో కలిపి ఏ రోజున లోక్ సభలో ప్రవేశపెట్టింది ?
ఎ) 1972 డిసెంబర్ 20
బి) 1972 డిసెంబర్ 23
సి) 1972 డిసెంబర్ 25
డి) 1972 డిసెంబర్ 21 #
25) ముల్కీ నిర్వచనం అను పదం అర్థంను వివరిస్తూ తీర్పు చెప్పిన హైకోర్టు న్యాయమూర్తి ఎవరు ?
ఎ) ఓబుల్ రెడ్డి #
బి) జస్టిస్ కుమరయ్య
సి) జస్టిన్ గోపాలరావు
డి) ఎం. హిదయతుల్లా

WRITERS OF TELANGANA

రచయితలు గ్రంథాలు


1) తెలంగాణా వైతాళికుల గ్రంథమును ఎవరు రచించారు ?
ఎ) బిరుదురాజు
బి) పేర్వారం జగన్నాథం
సి) నెల్లుట్ల రమణరావు #
డి) కాళోజీ నారాయణరావు
2) కళ్యాణ కారక అనే వైద్యశాస్త్ర గ్రంథాన్ని ఎవరు రాశారు ?
ఎ) చండ్ర రాజేశ్వరరావు
బి) ఉగ్రాదిత్యుడు #
సి) గుర్రం జషువా
డి) ములుగు వీరభద్రకవి
3) నాగార్జున సాగరము అను గ్రంథమును రచించినది ఎవరు ?
ఎ) దాశరథి
బి) రావూరి భరద్వాజ
సి) అందెశ్రీ
డి) ఆచార్య సి. నారాయణరెడ్డి #
4) విశ్వనాథ సత్యనారాయణ రచించిన గ్రంథం పేరు ఏమిటి ?
ఎ) కర్పూర వసంతరాయలు
బి) తెలంగాణా వైతాళికులు
సి) నాగార్జున సాగరము
డి) పైవేవి కావు #
5) జానపద చారిత్రక గేయగాథలు గ్రంథ రచయిత ఎవరు ?
ఎ) గంగాధరం
బి) నాయని కృష్ణకుమారి
సి) జయధీర్ తిరుమలరావు #
డి) బిరుదు రామరాజు
6) సాహిత్య సోపానాలు అనే సాహిత్య విమర్శ గ్రంథాన్ని ఎవరు రచించారు ?
ఎ) పేర్వారం జగన్నాథం
బి) దివాకర్ల వేంకటావధాని #
సి) పింగళి లక్ష్మీకాంతం
డి) సి.నారాయణరెడ్డి
7) రెంటాల గోపాలకృష్ణ గారు రచించిన గ్రంథం ఏది ?
ఎ) నా గొడవ
బి) తెలంగాణ
సి) రుద్రవీణ
డి) సర్పయాగం #
8) కవి హేమాద్రి రచించిన గ్రంథం పేరు ఏమిటి ?
ఎ) విప్లవ వీరులు
బి) వ్రత ఖండం #
సి) ప్రవచన సారం
డి) కాతంత్ర వ్యాకరణం
9) జీవనాడి, మౌనం యుద్ధనేరం అనే రచనలను రాసింది ఎవరు ?
ఎ) వేదకుమార్
బి) విమలక్క
సి) వరవరరావు #
డి) గద్దర్
10) పార్ధవ న్యాయం అనే రచనను ఎవరు రచించారు ?
ఎ) దాశరధి
బి) దేవులపల్లి రామానుజరావు #
సి) గోరటి వెంకన్న
డి) కాళోజీ నారాయణరావు
11) హరిభద్రుడు రచించిన గ్రంథం ఏది ?
ఎ) హర్ష చరిత్ర
బి) నీతిసారం
సి) ప్రాకృత గ్రంథం
డి) జైనమత గ్రంథం #
12) మితాక్షరి అనే సంస్కృత గ్రంథాన్ని రచించిన కవి ఎవరు ?
ఎ) సారంగు తమ్మయ
బి) కేతన
సి) విజ్ఞానేశ్వరుడు #
డి) విద్ధనాచార్య
13) నన్నయ్య భట్టారకుడు రచించిన తెలుగు వ్యాకరణ గ్రంథం ఏది ?
ఎ) పద్మపురాణం
బి) ఆంధ్ర శబ్ద చింతామణి #
సి) ప్రేమాభిరామం
డి) బాలభారతం
14) వేములవాడ భీమకవి రచించిన రచనలు ఏవి ?
ఎ) కవిజనాశ్రయం #
బి) శివతత్త్వసారము
సి) భద్రాద్రి రామ శతకం
డి) నీతిసారం
15) అశీరీభవ విజయం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు ?
ఎ) అద్దంకి గంగాధరుడు
బి) మరిగంటి సంగాచుర్యులు
సి) కొలని గణపతి దేవుడు #
డి) సారంగు తమ్మయ
16) రాజశేఖరుడు రచించిన గ్రంథం పేరు ఏమిటి ?
ఎ) వాయిద్య రత్నావళి
బి) ప్రవచనసారం
సి) ఆరోగ్య మంజరి
డి) కావ్యమీమాంస #
17) శోకవార్తికం అనే గ్రంథాన్ని ఏ కవి రచించాడు ?
ఎ) కొలని గణపతి దేవుడు
బి) కొలను రుద్రుడు #
సి) మారన
డి) రాజశేఖరుడు
18) శివదేవయ్య రచించిన గ్రంథం పేరు ఏమిటి ?
ఎ) పురుషార్థ సారం #
బి) వ్రత ఖండం
సి) సమయ సారం
డి) పద్మపురాణం
19) సారంగు తమ్మయ రచించిన గ్రంథం ఏది ?
ఎ) శోకవర్తికం
బి) లక్ష్మణసారసంగ్రహం
సి) వైజయంతీ విలాసం #
డి) శివయోగ సారం
20) బూర్గుల రామకృష్ణారావు రచించిన రచనలు ఏవి ?
ఎ) శివాజీ చరిత్ర
బి) కవితామంజరి #
సి) లక్ష్మణసారసంగ్రహం
డి) పైవేవి కావు
21) బాలభారతం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు ?
ఎ) శ్రీశ్రీ
బి) శివదేవయ్య
సి) శర్వవర్మ
డి) అగస్త్యుడు #
22) ప్రమేయ చర్చామృతం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు ?
ఎ) గద్దె లింగయ్య
బి) శాకల్య మల్లుభట్టు
సి) విద్ధనాచార్య #
డి) క్రొవ్విడి లింగరాజు
23) భట్టవామనుడు రచించిన గ్రంథం పేరు ఏమిటి ?
ఎ) కావ్యాలంకార సూత్ర #
బి) నేను నా దేశం
సి) ఖడ్గసృష్టి
డి) నిరోష్ట్య రామాయణం
24) అభినవ దర్పణం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు ?
ఎ) విద్ధనాచార్య
బి) ఉగ్రదిత్యుడు
సి) లాయక్ అలీ
డి) నందికేశ్వరుడు #
25) పుచ్చలపల్లి సుందరయ్య రచించిన గ్రంథం ఏది ?
ఎ) నేను నా దేశం
బి) విశాలాంధ్రలో ప్రజారాజ్యం #
సి) తాకట్టులో భారతదేశం
డి) చివరకు మిగిలేది

TELANGANA MOVEMENT SONGS

ఉద్యమపాటలు




1) ఊరు తెలంగాణ, నా పేరు తెలంగాణ అనే పాట ఎవరు పాడారు ?
ఎ) గద్దర్
బి) జయరాజు
సి) రచ్చ భారతి
డి) అందెశ్రీ #
2) పల్లె కన్నీరు పెడుతుందో... కనిపించని కుట్రల పాట ఎవరు రాశారు ?
ఎ) కోదటి శ్రీను
బి) గోరటి వెంకన్న #
సి) గూడ అంజన్న
డి) గద్దర్
3) అమ్మా తెలంగాణమా-ఆకలి కేకల రాజ్యమా పాటకు రచయిత ఎవరు ?
ఎ) అందెశ్రీ
బి) అంబటి వెంకన్న
సి) గద్దర్డి #                                                                                                                                                                                                   d) వరంగల్ శ్రీను
4) తెలంగాణ నెత్తుటి మట్టివాసనలో.. ఒరిగిన అమరుల వీరగంథాలు అనే పాటకు రచయిత ఎవరు ?
ఎ) కొదాటి శ్రీను
బి) అందెశ్రీ
సి) రచ్చ భారతి
డి) వరంగల్ శ్రీను #
5) గద్దర్ భువనగిరి సభలో పాడిన పాట ఏది ?
ఎ) అమ్మా పైలంగా ఉండు అమ్మమాయమ్మ
బి) నాతల్లి తెలంగాణ తిరగబడ్డ వీణ #
సి) ఉస్మానియా క్యాంపస్ లో
డి) అయ్యోనివా నువ్వు అవ్వొనివా
6) ఊరు మనదిరా... వాడా మనదిరా... అనే గేయ రచయిత ఎవరు ?
ఎ) గూడ అంజన్న #
బి) వరంగల్ శ్రీను
సి) అంబటి వెంకన్న
డి) గోరటి వెంకన్న
7) తెలంగాణ గట్టు మీద చందమామయో అనే పాటకు రచయిత ఎవరు ?
ఎ) అంబటి వెంకన్న
బి) గద్దర్
సి) మండె సత్యనారాయణ #
డి) గూడ అంజన్న
8) జై బోలో తెలంగాణ లో ‘గారడి జేస్తుండ్రు’ అనే పాట రచయిత ఎవరు ?
ఎ) గద్దర్
బి) కేసీఆర్ #
సి) గోరటి వెంకన్న
డి) కె.టి.ఆర్
9) తెలంగాణ ఇచ్చేటందుకు ఎన్ని కమిటీలేస్తరో... అనే పాటకు రచయిత ఎవరు ?
ఎ) అందెశ్రీ
బి) మండె సత్యనారాయణ
సి) గద్దర్
డి) యశ్ పాల్ #
10) అభినయ శ్రీనివాస్ రచించిన పాట ఏది ?
ఎ) ఉస్మానియా క్యాంపస్ లో #
బి) ఊరు మనదిరా... వాడా మనదిరా
సి) వందనాలమ్మ
డి) నాతల్లి తెలంగాణ తిరగబడ్డ వీణ
11) వందనాలమ్మ అనే పాట ఎవరు రాశారు ?
ఎ) నెర్నాల కిషోర్
బి) రసబాయి బాలకిషన్
సి) జయరాజు #
డి) యశ్ పాల్
12) ఎట్లున్నవే నా పల్లే, నువ్వు ఎట్టున్నవే నా తల్లి.. గేయ రచయిత ఎవరు ?
ఎ) రచ్చ భారతి
బి) నెర్నాల కిషోర్ #
సి) అంబటి వెంకన్న
డి) గూడ అంజన్న
13) బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ పాట రచయిత ఎవరు ?
ఎ) గద్దర్
బి) గూడ అంజన్న
సి) అంబటి వెంకన్న
డి) గోరటి వెంకన్న #
14) గద్దర్ పాడిన మొదటి పాట ఏది ?
ఎ) జైబోలో తెలంగాణ
బి) వెల్లి పోతున్నావాతల్లి
సి ఆపరా రిక్షా #
డి) నాతల్లి తెలంగాణ తిరగబడ్డ వీణ
15) జై బోలో అమరవీరులకు, పల్లె కన్నీరు పెడుతుందో పాటల రచయిత ఎవరు ?
ఎ) గోరటి వెంకన్న #
బి) గూడ అంజన్న
సి) అంబటి వెంకన్న
డి) నెర్నాల కిషోర్
16) జయ జయహే తెలంగాణ... జననీ జయకేతనం అనే గేయంను రచించింది ఎవరు ?
ఎ) గద్దర్
బి) అందెశ్రీ #
సి) దేశపతి శ్రీనివాస్
డి) పైవారు ఎవరు కాదు
17) పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే... పాట రచయిత ఎవరు ?
ఎ) అందెశ్రీ
బి) వందేమాతరం
సి) రసమయి
డి) మిత్ ర #
18) ఇదేనండి ఎర్రెర్రని తెలంగాణ అనే పాటను వ్రాసింది ఎవరు ?
ఎ) బద్దం ఎల్లారెడ్డి
బి) గోరెటి వెంకన్న
సి) చెరబండరాజు #
డి) అంబాటి వెంకన్న
19) నాగేటి సాల్లల్ల-నా తెలంగాణ పాట రచయిత ఎవరు ?
ఎ) నందిని సిధారెడ్డి #
బి) అందెశ్రీ
సి) దేశపతి శ్రీనివాస్
డి) గద్దర్
20) తెలంగాణ తల్లి నీకు నిండు దీపాలు పాట రచయిత ఎవరు ?
ఎ) గోరెటి వెంకన్న
బి) అందెశ్రీ
సి) కోదాటి శ్రీను
డి) వరంగల్ శ్రీను #
21) నిన్ను విడిచి ఉండలేనమ్మా-ఓ పాటమ్మ అనే పాటకు గేయ రచయిత ఎవరు ?
ఎ) దేశపతి శ్రీనివాస్
బి) దేవరకొండ బిక్షపతి #
సి) చెడబండరాజు
డి) నందిని సిద్ధారెడ్డి
22) చూడు చూడు నల్గొండ... గుండె నిండ ఫ్లోరైడ్ బండ పాట రచయిత ఎవరు ?
ఎ) కోదాటి శ్రీను #
బి) గద్దర్
సి) అందెశ్రీ
డి) వరంగల్ శ్రీను
23) అయ్యో నీవా నీవు అవ్వో నీవా... అనే పాటకు రచయిత ఎవరు ?
ఎ) మండె సత్యనారాయణ
బి) అంబటి వెంకన్న
సి) గూడ అంజన్న #
డి) గద్దర్
24) రాజ్య హింస పెరుగుతున్నాదో... పేదోళ్ళ నెత్తూరు పాట రచయిత ఎవరు ?
ఎ) అంబటి వెంకన్న
బి) గోరటి వెంకన్ న #
సి) కోదాటి శ్రీను
డి) గూడ అంజన్న
25) ఆడుదాం దప్పుల్లా దరువేయ్యిరా... అనే గేయ రచయిత ఎవరు ?
ఎ) మిత్ర #
బి) నెర్నాల కిషోర్
సి) మండె సత్యనారాయణ
డి) వందెమాతరం

TEMPLES IN TELANGANA

దేవాలయాలు



1) తెలంగాణలో ఏకైక చాముండేశ్వరీ దేవి ఆలయం ఎక్కడ ఉంది ?
ఎ) నల్గొండ జిల్లా
బి) మెదక్ జిల్లా #
సి) కామారెడ్డి జిల్లా
డి) సంగారెడ్డి జిల్లా
2) కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాల్లో అతిపెద్ద ఆలయం ఏది ?
ఎ) నాగోబా దేవాలయం
బి) కూసుమంచి శివాలయం #
సి) శ్రీ శంభులింగేశ్వర ఆలయం
డి) శ్రీ చాముండేశ్వరిదేవి ఆలయం
3) రామునిచే ప్రతిష్టించబడిన శివలింగమున్న దేవాలయం ఏది ?
ఎ) కొమురవెల్లి మల్లన్న దేవాలయం
బి) కూసుమంచి శివాలయం
సి) శ్రీ శంభులింగేశ్వర ఆలయం
డి) కీసర రామలింగేశ్వరాలయం #
4) చిలుకూరు బాలాజీకి గల మరోక పేరు ఏమిటి ?
ఎ) పాస్ పార్ట్ బాలాజీ
బి) ఫారెన్ బాలాజీ
సి) వీసా బాలాజీ #
డి) ఏదీ కాదు
5) రెండవ శాతకర్ణి నిర్మించిన జైన ఆలయం ఏది ?
ఎ) నీలకంఠేశ్వరాలయం #
బి) నవనాథ సిద్ధేశ్వరాలయం
సి) రామప్ప దేవాలయం
డి) కాళేశ్వరం ఆలయం
6) ఒకే పీఠంపై రెండు శివలింగాలున్న దేవాలయం ఎక్కడ ఉంది ?
ఎ) రామప్ప దేవాలయం
బి) నీలకంఠేశ్వరాలయం
సి) కూసుమంచి శివాలయం
డి) కాళేశ్వరం శివాలయం #
7) మహబుబ్ నగర్ జిల్లాలో పశ్చిమ చాళుక్య రాజులు నిర్మించిన ఆలయం ఏది ?
ఎ) నవనాథ సిద్ధేశ్వరాలయం
బి) ఆలంపురం ఆలయం #
సి) శ్రీ చాముండేశ్వరిదేవి ఆలయం
డి) నీలకంఠేశ్వరాలయం
8) కాకతీయ చాళుక్య శైలిలో హన్మకొండలో రుద్రమదేవుడు నిర్మించిన ఆలయం పేరు ఏది?
ఎ) రామప్ప దేవాలయం
బి) మన్యంకొండ దేవాలయం
సి) వేయి స్తంభాల గుడి #
డి) ఆలంపూర్ దేవాలయాలు
9) కాకతీయ గణపతిదేవుడు శ్రీ శంభులింగేశ్వర ఆలయాన్ని ఎక్కడ నిర్మించారు ?
ఎ) వరంగల్ #
బి) నిజామాబాద్
సి) రంగారెడ్డి
డి) మెదక్
10) పశ్చిమ చాళుక్యరాజు రెండవ పులకేశి వేంగి, తెలంగాణలను జయించినందుకు విజయ చిహ్నంగా ఏ ఆలయాన్ని నిర్మించారు ?
ఎ) ఎల్లమ్మ దేవాలయం
బి) పెద్దమ్మ ఆలయం
సి) ఏడుపాయల కనకదుర్గమ్మ ఆలయం
డి) భద్రకాళీ ఆలయం #
11) శాతవాహనులు, కళ్యాణి చాళుక్యులు అభివృద్ధి చేసిన ఆలయం పేరు ఏమిటి ?
ఎ) బాసర
బి) ధర్మపురి #
సి) బిర్లామందిర్
డి) యాదగిరి గుట్ట
12) తెలంగాణలో అతి పెద్దదైన 2వ తిరుపతిగా పేరుగాంచిన వేంకటేశ్వర దేవాలయం ఏది ?
ఎ) ఆలంపూర్ దేవాలయం
బి) శ్రీ శంభులింగేశ్వర ఆలయం
సి) రామప్ప దేవాలయం
డి) మన్యంకొండ దేవాలయం #
13) 17వ శతాబ్ధంలో తెలుపు నలుపు నాపరాతితో నిర్మించిన ఆలయం ఏది ?
ఎ) డిచ్ పల్లి రామాలయం #
బి) కీసర రామలింగేశ్వరాలయం
సి) సరస్వతి ఆలయం
డి) ఆలంపూర్ ఆలయం
14) నిర్మల్ జిల్లాలోని బిర్భలుడనే కన్నడరాజు నిర్మించిన ఆలయం ఏది ?
ఎ) భద్రకాళీ ఆలయం
బి) డిచ్ పల్లి ఆలయం
సి) సరస్వతి ఆలయం #
డి) బాలాజీ ఆలయం
15) బౌద్ధమత విశేషాలతో కూడిన మ్యూజియం ఏ కొండపై ఉంది ?
ఎ) కోయిల కొండ
బి) నాగార్జున కొండ #
సి) లింబాద్రి గుట్ట
డి) పైవేవి కావు
16) కోస్లాపూర్ లో ఉన్న గోండు ప్రజలు ఏ దేవాలయంలో జాతరను జరుపుకుంటారు ?
ఎ) వందస్తంభాల ఆలయం
బి) హనుమాన్ దేవాలయం
సి) మన్యంకొండ దేవాలయం
డి) నాగోబా దేవాలయం #
17) ఫ్రెంచివారు నిర్మించిబడిన నిర్మల్ కోటకు మరొక పేరు ఏమిటి ?
ఎ) శామ్ గాడ్ కోట #
బి) గద్వాల్ కోట
సి) మెదక్ కోట
డి) గోల్కొండ కోట
18) నామిరెడ్డి నిర్మించిన త్రికూట ఆలయం ఏది ?
ఎ) ఎలగందల్ కోట
బి) ఓరుగల్లు కోట
సి) పిల్లలమర్రి #
డి) దోమకొండ
19) మొగల్ వాస్తుశైలి ప్రతిబింబించే అద్దాలమేడ అని పిలవబడే కోట ఏది ?
ఎ) ఓరుగల్లు కోట
బి) భువనగిరి కోట
సి) నిర్మల్ కోట
డి) దోమకొండ #
20) దేశంలో అతిపెద్ద ఫిరంగి ఏ కోటలో ఉంది ?
ఎ) ఎలగందల్ కోట
బి) గద్వాల్ కోట #
సి) మెదక్ కోట
డి) నిర్మల్ కోట
21) రుద్రదేవుడు నిర్మించిన దేవాలయం పేరు ఏమిటి ?
ఎ) రాచకొండ కోట
బి) వందస్తంభాల ఆలయం
సి) వెయ్యి స్తంభాల గుడి #
డి) మన్యంకొండ దేవాలయం
22) శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన గండభేరుండ ముద్ర ఏ కోటలో కన్పిస్తుంది ?
ఎ) మెదక్ కోట #
బి) నిర్మల్ కోట
సి) గద్వాల్ కోట
డి) భువనగిరి కోట
23) త్రిభువనమల్ల విక్రమాదిత్య పేరు మీద వచ్చిన కోట ఏది ?
ఎ) గద్వాల్ కోట
బి) రాచకొండ కోట
సి) భువనగిరి కోట #
డి) ఇవేవి కావు
24) కరీంనగర్ పూర్వ నామంగా నిర్మించిబడిన కోట పేరు ఏమిటి ?
ఎ) దోమకొండ
బి) ఎలగందల్ కోట #
సి) మెదక్ కోట
డి) నిర్మల్ కోట
25) మొదట కాకతీయులు నిర్మించిన గోల్కొండ పూర్వనామం ఏది ?
ఎ) మంకాల్ #
బి) రాచకొండ కోట
సి) నిర్మల్ కోట
డి) దోమకొండ

CULTURAL ASPECTS & FAIRS OF TELANGANA

సంస్కృతి, జాతరలు



1) ఆదిలాబాద్ కేస్లాపూర్ లో గోండులు జరుపుకునే జాతర ఏది ?
ఎ) గొల్లగట్టు జాతర
బి) ఏడుపాయల జాతర
సి) నాగోబా జాతర #
డి) తేగడ జాతర
2)సమక్క సారక్క జాతరలో ప్రదర్శించే నృత్యం ఏది ?
ఎ) కుర్రు నృత్యం #
బి) గుస్సాడి నృత్యం
సి) థింసా నృత్యం
డి) కోయ నృత్యం
3) బతుకమ్మ ఉత్సవాల మొదటి రోజును ఏమని వ్యవహరిస్తారు ?
ఎ) సద్దుల బతుకమ్మ
బి) ఎంగిలి పూల బతుకమ్మ #
సి) బతుకమ్మ తొలి ఉత్సవం
డి) అటుకుల బతుకమ్మ
4) కుతుబ్ షాహీల కాలం నుండి జరుపుకునే జాతర ఏది ?
ఎ) కురుమూర్తి జాతర
బి) పెద్దమ్మ జాతర #
సి) కొండగట్టు జాతర
డి) బెజ్జంకి జాతర
5) సమక్క సారక్క జాతర ఏ జిల్లాలో జరుగుతుంది ?
ఎ) మెదక్
బి) ఖమ్మం
సి) జయశంకర్ భూపాలపల్లి #
డి) ఆదిలాబాద్
6) కాకతీయుల కాలంలో గొప్ప ఆదరణ కలిగిన నృత్యం ఏది ?
ఎ) పేరిణి నృత్యం #
బి) గుస్సాడి నృత్యం
సి) గరగ నృత్యం
డి) సిద్ధీ నృత్యం
7) ఆదిలాబాద్ లోని రాజగోండులు దీపావళినాడు ఏ నృత్యాన్ని ప్రదర్శిస్తారు ?
ఎ) కుర్రు నృత్యం
బి) కోయ నృత్యం
సి) గుస్సాడి నృత్యం #
డి) థింసా నృత్యం
8) బోనాల పండుగ నాడు మట్టికుండలు నెత్తి మీద పెట్టుకుని చేసే నృత్యం ఏది ?
ఎ) కోయ నృత్యం
బి) గుస్సాడి నృత్యం
సి) పేరిణి నృత్యం
డి) గరగ నృత్యం #
9) సమ్మక్క సారక్క అమ్మవార్లకు సమర్పించే నైవేద్యం ఏది ?
ఎ) వెండి
బి) బెల్లం (బంగారం) #
సి) రాగి
డి) పైవేవి కావు
10) కురుబ వంశస్థులు చేసే నృత్యం ఏది ?
ఎ) ధింసా నృత్యం
బి) పేరిణి నృత్యం
సి) రేల నృత్యం
డి) గొరవయ్యల నృత్యం #
11) ఏడుపాయల జాతర ఏ జిల్లాలో జరుగుతుంది ?
ఎ) మెదక్ #
బి) ఆదిలాబాద్
సి) వరంగల్
డి) మహబుబ్ నగర్
12) కోయ తెగల గిరిజనుల సంప్రదాయ నృత్యం ఏది ?
ఎ) ఉరుముల నృత్యం
బి) గురుకుల నృత్యం
సి) రేల నృత్యం #
డి) గొరవయ్యల నృత్యం
13) నాగోబా జాతరను గిరిజనులు ఎన్ని రోజులు జరుపుకుంటారు ?
ఎ) 15 రోజులు
బి) 10 రోజులు #
సి) 20 రోజులు
డి) 25 రోజులు
14) రాజుల కాలంలో ఎక్కువగా కర్ర ముక్కలతో శబ్ధం చేస్తూ, పాట పాడుతూ చేసే నృత్యాన్ని ఏమంటారు ?
ఎ) తోలుబొమ్మలాట
బి) లంబాడీ నృత్యం
సి) తప్పెటగుళ్ళు
డి) జడ కోలాటం #
15) గొల్లగట్టు జాతర ఎక్కువగా ఏ జిల్లాలో జరుగుతుంది ?
ఎ) మెదక్ జిల్లా
బి) వరంగల్ జిల్లా
సి) నల్గొండ జిల్లా #
డి) రంగారెడ్డి జిల్లా
16) ఆషాడ మాసంలో జరుపుకునే పండుగ పేరు ఏమిటి ?
ఎ) దసరా
బి) బోనాలు #
సి) బతుకమ్మ
డి) పైవేవి కావు
17) జగిత్యాల జిల్లాలో ఎక్కువగా ఏ జాతర జరుపుకుంటారు ?
ఎ) కొండగట్టు జాతర #
బి) కొమరవెల్లి మల్లన్న జాతర
సి) పెద్దమ్మ జాతర
డి) కురుమూర్తి జాతర
18) ఆదిలాబాద్ జిల్లాలో జరిగే గిరిజనుల పండుగ ఏది ?
ఎ) కొండగట్టు జాతర
బి) మేళ్ళచేర్వు జాతర
సి) పెద్దమ్మ జాతర
డి) బుర్నూరు జాతర #
19) సిద్ధీ నృత్యానికి మరో పేరు ఏమిటి ?
ఎ) ధూలా నృత్యం
బి) ఖడ్గ నృత్యం #
సి) దింసా నృత్యం
డి) రేల నృత్యం
20) గ్రామదేవతల ఉత్సవాల్లో ఎక్కువగా ఏ నృత్యం చేస్తారు ?
ఎ) లంబాడీ నృత్యం
బి) దింసా నృత్యం
సి) పోతురాజుల నృత్యం #
డి) డప్పు నృత్యం
21) విజయదశమి పండుగ నాడు ప్రజలు ఒకరికొకరు బంగారం పేరుతో ఇచ్చి పుచ్చుకునే వస్తువును ఏమంటారు ?
ఎ) జమ్మి ఆకులు #
బి) వెండి
సి) రాగి
డి) పూలు
22) శివరాత్రి రోజున ప్రత్యేకంగా జరుపుకునే జాతర ఏది ?
ఎ) కురుమూర్తి జాతర
బి) మారమ్మ తల్లి జాతర
సి) గంగామ్మ జాతర
డి) కొమరవెల్లి మల్లన్న జాతర #
23) కొమ్ములను ధరించి వాద్యాలను వాయిస్తూ తెగలు చేసే నృత్యం ఏది ?
ఎ) లంబాడీ నృత్యం
బి) మయూరి నృత్యం #
సి) డప్పు నృత్యం
డి) రేల నృత్యం
24) లంబాడీలు ప్రతి సంవత్సరం తొలకరి వర్షాలు కురిసే సమయంలో జరుపుకునే పండుగ ఏది ?
ఎ) పెద్దదేవుని పండుగ
బి) మారమ్మ తల్లి జాతర
సి) నాగదేవత పండుగ
డి) ఎడ్లదాటుడు పండుగ #
25) తెలంగాణ ప్రాంతంలో ఒగ్గువారు ప్రదర్శించే ప్రదర్శనను ఏమంటారు ?
ఎ) డప్పు నృత్యం
బి) ఒగ్గుడోలు #
సి) కత్తుల నృత్యం
డి) గరగ నృత్యం

TELANGANA GOVERNMENT SCHEMES

రాష్ట్ర ప్రభుత్వ పథకాలు



1) రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తాగునీటిని అందించిన పథకం ఏది ?
ఎ) మిషన్ కాకతీయ
బి) దేవాదుల ఎత్తిపోతల పథకం
సి) మిషన్ భగీరథ #
డి) మిషన్ కాకతీయ రెండో దశ
2) డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పథకం ఎక్కడ ప్రారంభించారు ?
ఎ) మెదక్ జిల్లా, ఎర్రపల్లి
బి) మెదక్ జిల్లా, నరసన్నపేట #
సి) నల్గొండ జిల్లా, సూర్యాపేట
డి) పైవేవి కావు
3) ఆసరా ఫించన్ల పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు ?
ఎ) సూర్యాపేట
బి) షాద్ నగర్
సి) గద్వాల్
డి) కొత్తూర్ #
4) రూపాయికి మనిషికి 6 కిలోల బియ్యం సరఫరా చేస్తున్న పథకం ఏది ?
ఎ) ఆసరా ఫించన్లు
బి) ఆహార భద్రత #
సి) మిషన్ కాకతీయ
డి) మిషన్ భగీరథ
5) తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ ప్రాజెక్టు రెండవ దశను ఎప్పుడు ప్రారంభించారు ?
ఎ) 2016 జనవరి 22
బి) 2016 మార్చి 17
సి) 2016 ఏప్రిల్ 15
డి) 2016 ఫిబ్రవరి 17 #
6) మిషన్ భగీరథను ఎవరు ఎప్పుడు ప్రారంభించారు ?
ఎ) నరసింహన్, ఆగస్ట్ 2
బి) కేసీఆర్, ఆగస్ట్ 4
సి) నరేంద్ర మోడీ, ఆగస్ట్ 7 #
డి) హరీష్ రావు ఆగస్ట్ 6
7) నిరుపేదలకు జీవనోపాది అవకాశాలు పెంపొందించటానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పేరు ఏమిటి ?
ఎ) తెలంగాణ పల్లె ప్రగతి పథకం #
బి) గ్రామ జ్యోతి పథకం
సి) మార్జిన్ మనీ పథకం
డి) ఇవేవి కావు
8) గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహరం అందించటానికి ప్రవేశపెట్టిన పథకం ఏది ?
ఎ) ఆరోగ్య శ్రీ
బి) ఆరోగ్య భీమా
సి) ఆసరా పథకం
డి) ఆరోగ్య లక్ష్మి #
9) ఆరోగ్య లక్ష్మి పథకం ఎప్పుడు అమలులోకి వచ్చింది ?
ఎ) 2015 ఫిబ్రవరి 4
బి) 2015 జనవరి 1 #
సి) 2015 మార్చి 1
డి) 2015 జనవరి 5
10) మహిళ డ్రైవర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించింది ?
ఎ) ఆసరా పథకం
బి) ఆరోగ్య లక్ష్మి
సి) షీ క్యాబ్స్ పథకం #
డి) షీ టీమ్స్
11) రెండో విడత హరితహారం కార్యక్రమం ఎక్కడ ప్రారంభమైంది ?
ఎ) గుండ్రాంపల్లి #
బి) చిలుకూరు
సి) గజ్వేల్
డి) సిద్ధిపేట
12) మైనారిటీ యువతుల పెళ్ళిళ్ళ కోసం ఉద్దేశించిన పథకం ఏది ?
ఎ) ఆసరా పథకం
బి) ఆరోగ్య పథకం
సి) కళ్యాణ లక్ష్మి
డి) షాదీ ముబారక్ #
13) గ్రామీణ ప్రజలు ఊరిని అభివృద్ధి చేసుకునే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు-మన ప్రణాళిక అనే పథకం ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారు ?
ఎ) 2015 సెప్టెంబర్, వరంగల్ జిల్లా
బి) 2014 ఆగస్ట్, మెదక్ జిల్లా
సి) 2014 జులై, నల్గొండ జిల్లా #
డి) 2016 జులై, మహబూబ్ నగర్ జిల్లా
14) కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ?
ఎ) 2014 అక్టోబర్ #
బి) 2014 డిసెంబర్
సి) 2014 సెప్టెంబర్
డి) 2014 నవంబర్
15) గ్రామజ్యోతి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ?
ఎ) 2015 జులై 20
బి) 2015 నవంబర్ 10
సి) 2015 ఆగస్ట్ 17 #
డి) 2015 జూన్ 11
16) షీ టీమ్స్ ను ఎప్పుడు ప్రారంభించారు ?
ఎ) 2015 జనవరి 20
బి) 2014 అక్టోబర్ 24 #
సి) 2015 మే 24
డి) 2014 డిసెంబర్ 22
17) ప్రస్తుతం ఆరోగ్య లక్ష్మిగా పేర్కోంటున్న పథకాన్ని గతంలో ఏమని పిలిచేవారు ?
ఎ) ఆరోగ్య కిరణాలు
బి) ఆరోగ్య వాణి
సి) రాజీవ్ అమృత హస్తం
డి) ఇందిరమ్మ అమృత హస్తం #
18) వాటర్ గ్రిడ్ పథకం పేరు ఏమిటి ?
ఎ) మిషన్ కాకతీయ
బి) మిషన్ భగీరథ #
సి) ఆరోగ్య పథకం
డి) ఇవేవి కావు
19) వితంతువులకు అమలు చేస్తున్న ఆసరా పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తారు ?
ఎ) జీవనాధారం #
బి) జీవనోపాధి
సి) చేయూత
డి) రక్షణ
20) కల్యాణలక్ష్మి పథకం కింద బీసీ యువతులకు కూడా పెళ్ళి సమయంలో ఆర్థిక సహాయాన్ని ఎప్పటి నుంచి అందిస్తున్నారు ?
ఎ) 2016 మే 5
బి) 2016 జూన్ 2
సి) 2016 ఏప్రిల్ 1 #
డి) 2016 మార్చి 4
21) సద్దిమూట పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు ?
ఎ) సూర్యాపేట
బి) సిద్దిపేట #
సి) గుండ్రాం పల్లి
డి) వరంగల్
22) మొదటి విడత హరితహరం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు ?
ఎ) గోల్కొండ
బి) వరంగల్
సి) కొత్తూర్
డి) చిలుకూరు #
23) తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు ?
ఎ) సిద్దిపేట
బి) గుండ్రాంపల్లి
సి) కౌడిపల్లి #
డి) కొత్తూర్
24) ఆహార భద్రత పథకం లబ్దిదారులను ఏ సర్వే ఆధారంగా గుర్తించారు ?
ఎ) సమగ్ర భద్రతా సర్వే
బి) సమగ్ర కుటుంబ సర్వే #
సి) జనాభా లెక్కలు 2014
డి) ఏదీ కాదు
25) వృద్ధులకు అమలుచేస్తున్న ఆసరా పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తారు ?
ఎ) రక్షణ #
బి) జీవనాధారం
సి) భరోసా
డి) భద్రత

NEW AGE / MODERN POETS

ఆధునిక కవులు

1) తొలి తెలుగు సంకలన గ్రంథకర్త ఎవరు ?
ఎ) మాయబట్టు
బి) మడిక సింగన #
సి) విశ్వేశ్వరుడు
డి) పశుపతి నాగనాతకవి
2) వాణి నా రాణి అని గొప్పగా చెప్పుకొన్న మహాకవి ఎవరు ?
ఎ) సూరన
బి) గౌరన
సి) పాల్కురికి సోమన
డి) పిల్లలమర్రి పినవీరభద్రుడు #
3) నా జైలు అనుభవాలు జ్ఞాపకాలు రాసిన గ్రంథ రచయిత ఎవరు ?
ఎ) నల్ల నర్సింహులు
బి) రావి నారాయణ రెడ్డి
సి) సంఘం లక్ష్మీబాయి #
డి) దేవులపల్లి వెంకటేశ్వరరావు
4) తెలుగులో మొదటి లక్షణ గ్రంథం ఏది ?
ఎ) నీతిశాస్త్రముక్తవళి
బి) గధాయుద్ధం #
సి) విక్రమార్జున విజయం
డి) కవిజనాశ్రయం
5) మొదటి గోకర్ణుడి కాలం నాటి శాసన కవి ఎవరు ?
ఎ) అప్పకవి
బి) కస్తూరి రంగకవి
సి) త్రిపురాంతకుడు #
డి) రుద్రకవి
6) నా గొడవ అనే పుస్తక రచయిత ఎవరు ?
ఎ) సురంవరం ప్రతాపరెడ్డి
బి) కాళోజీ నారాయణరావు #
సి) కొండా లక్ష్మణ్ బాపూజీ
డి) వట్టికోట ఆళ్వారుస్వామి
7) నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న కవి ఎవరు ?
ఎ) దాశరథి కృష్ణమాచార్య #
బి) దాశరథి రంగాచార్య
సి) కాళోజీ నారాయణరావు
డి) శ్రీరంగం శ్రీనివాసరావు
8) గౌరన రాసిన ప్రసిద్ధి గ్రంథం ఏది ?
ఎ) శ్రీరంగ మహాత్మ్యం
బి) భోజరాజీయం
సి) శిషుపాలవధ
డి) నవనాథచరిత్ర #
9) కందనమాత్యుని రచన ఏది ?
ఎ) సంగీత సుధాకరం
బి) రసార్ణవ సుధాకరం
సి) నీతి తారావళి #
డి) మదన విలాసం
10) ఆది హిందూ లైబ్రరీ స్థాపకులు ఎవరు ?
ఎ) దేవులపల్లి వెంకటేశ్వరరావు
బి) బి.ఎస్ వెంకట్రావు #
సి) చౌడవరం విశ్వనాథం
డి) పాములపర్తి సదాశివరావు
11) హలికుడు కావ్య రచయిత ఎవరు ?
ఎ) కాళోజీ నారాయణరావు
బి) దేవులపల్లి వెంకటేశ్వరరావు
సి) గంగుల శాయిరెడ్డి
డి) గవ్వా మురహరరెడ్డి #
12) తెలుగు భాషలో తొలిసారిగా ఎలిజీ (Elegy)లను ఎవరిపై రాశారు ?
ఎ) కొమర్రాజు లక్ష్మణరావు
బి) గంగుల శాయిరెడ్డి
సి) రావిచెట్టు రంగారావు #
డి) కాళోజీ నారాయణరావు
13) ప్రజల మనిషి నవలా రచయిత ఎవరు ?
ఎ) సురంవరం ప్రతాపరెడ్డి
బి) వట్టికోట ఆళ్వారుస్వామి #
సి) కాళోజీ నారాయణరావు
డి) భాగ్యరెడ్డి వర్మ
14) బందూక్ నవల రాసింది ఎవరు ?
ఎ) సుజాతరెడ్డి
బి) సురంవరం ప్రతాపరెడ్డి
సి) తిరునగిరి రామాంజనేయులు
డి) కందిమల్ల ప్రతారెడ్డి #
15) తెలంగాణ ప్రాంత తొలి దళిత కవి ఎవరు ?
ఎ) భాగ్యరెడ్డి వర్మ
బి) రావిచెట్టు రంగారావు
సి) చింతపల్లి దున్న ఇద్దాసు #
డి) చింతపల్లి రవన్న
16) పండితారాధ్య చరిత్ర రచయిత ఎవరు ?
ఎ) గణపతిదేవుడు
బి) బద్దున
సి) విద్యానాథుడు
డి) పాల్కురికి సోమనాథుడు #
17) పువ్వుల తోట ఖంట కావ్య రచయిత ఎవరు ?
ఎ) సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి #
బి) వీరరాఘవాచార్యులు
సి) హోసదుర్గం కృష్ణమాచార్యులు
డి) అయ్యచార్యులు
18) ద్విపద హరిశ్చంద్రోపాఖ్యానం రాసింది ఎవరు ?
ఎ) తిక్కన
బి) నారయ
సి) గౌరన #
డి) బద్దెన
19) మధురవాణీ విలాసం రచయిత ఎవరు ?
ఎ) గోపాల మంత్రి
బి) వీరరాఘవ కవి #
సి) వీరనరసింహ కవి
డి) శ్రీధర కృష్ణశాస్త్రి
20) తెలంగాణలో ఏం జరుగుతుంది అనే పుస్తక రచయిత ఎవరు ?
ఎ) గాదె ఇన్నయ్య
బి) మల్లేపల్లి లక్ష్మయ్య
సి) ప్రొఫెసర్ కోదండరాం
డి) ప్రోఫెసర్ జయశంకర్ #
21) కవిజనాశ్రయం అనే గ్రంథకర్త ఎవరు ?
ఎ) జివనల్లభుడు
బి) బద్దెన
సి) మల్లియరేచన #
డి) పంపకవి
22) రుద్రమదేవి నవల రచయిత ఎవరు ?
ఎ) బద్దిరాజు సీతారామచంద్రారువు
బి) బద్దిరాజు రాఘవ రంగారావు #
సి) సురవరం ప్రతాపరెడ్డి
డి) మాడపాటి హనుమంతరావు
23) భాస్కర రామాయణాన్ని ఎంతమంది కవులు రచించారు ?
ఎ) ఐదుగురు #
బి) ఒక్కరు
సి) ఇద్దరు
డి) నలుగురు
24) బండారు అచ్చమాంబ రచించిన తొలి కథానిక ఏది ?
ఎ) సంస్కర్త హృదయం
బి) దిద్దుబాటు
సి) హృదయశల్యం
డి) లలితాశారదులు #
25) వృషభపురాణం కవితా సంకలనం రచయిత ఎవరు ?
ఎ) వేమూరి నరసింహరెడ్డి
బి) పేర్వారం జగన్నాథం #
సి) మాడపాటి హనుమంతరావు
డి) కోవెల సుప్రసన్నాచార్య

FAMOUS CONTRUCTIONS IN HYDERABAD

హైదరాబాద్ ప్రసిద్ధ కట్టడాలు




1) చౌమహల్లా ప్యాలెస్ : ఎవరి నివాస భవనం?
ఎ) బ్రిటిష్ ప్రెసిడెంట్
బి) హైదరాబాద్ నిజాం నవాబు #
సి) భారత ప్రభుత్వ కార్యదర్శి
డి) బ్రిటీష్ గవర్నర్
2) చౌమహల్లా ప్యాలెస్ నిర్మాణాన్ని ఎవరు పూర్తి చేశారు ?
ఎ) ఔరంగజేబు
బి) షాజహాన్
సి) శివాజీ
డి) ఐదో అఫ్జలుద్దౌలా #
3) చౌమహల్లా ప్యాలెస్ ప్రాంగణాల విస్తీర్ణం ఎంత?
ఎ) 50 ఎకరాలు
బి) 30 ఎకరాలు
సి) 45 ఎకరాలు #
డి) 40 ఎకరాలు
4) కిల్వత్ ముబారక్ (దర్బార్ హాల్): ఇక్కడ ఎవరి సింహాసనముండేది?
ఎ) ఔరంగజేబు
బి) అసఫ్ జాహీల #
సి) రుద్రమదేవి
డి) షాజహాన్
5) దర్బార్ హాల్ లో ఏ దేశానికి చెందిన షాండియర్లను ఇటీవల అమర్చారు?
ఎ) అమెరికాకు చెందిన 20 షాండియర్లు
బి) రష్యాకు చెందిన 15 షాండియర్లు
సి) చైనాకు చెందిన 10 షాండియర్లు
డి) బెల్జియంకి చెందిన 19 షాండియర్లు #
6) క్లాక్ టవర్ : దీనిని ఏమని పిలుస్తారు?
ఎ) తారమతి బారాధర్
బి) పురానహవేలి
సి) కిల్వత్ క్లాక్ #
డి) గొల్కోండ కోట
7) క్లాక్ టవర్ లో గడియారం ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తోంది ?
ఎ) 150 సం.లు
బి) 100 సం.లు
సి) 300 సం.లు
డి) 250 సం.లు #
8) చార్మినార్ కట్టడం ఎత్తు ఎంత?
ఎ) 200 అడుగులు
బి) 180 అడుగులు #
సి) 250 అడుగులు
డి) 100 అడుగులు
9) చార్మినార్ ను ఎవరు నిర్మించారు?
ఎ) ఔరంగజేబు
బి) షాజహాన్
సి) మహ్మద్ కులీకుతుబ్ షా #
డి) ఏడవ నిజాం నవాబు
10) చార్మినార్ ను దేని నివారణకు సూచనగా నిర్మించారు ?
ఎ) కలరా
బి) మలేరియా
సి) మశూచి
డి) ప్లేగు #
11) చార్మినార్ వాస్తుశిల్పి ఎవరు?
ఎ) మీర్ ఉస్మాన్ అలీఖాన్
బి) మీర్ మొమిన్ అస్త్రబాది #
సి) మీర్ మెహబూబ్ ఆలీఖాన్
డి) ఆలీఖాన్
12) హైదరాబాద్ లో గాజులకు ప్రసిద్ది చెందిన ప్రాంతం ఏది ?
ఎ) బేగం బజార్
బి) లాల్ బజార్ #
సి) పత్తర్ ఘట్
డి) కోఠి
13) హైదరాబాద్ లో ఏ వర్తకం ప్రసిద్ది చెందినది?
ఎ) బంగారం
బి) వస్త్రాలు
సి) నూలు వస్త్రాలు
డి) ముత్యాలు #
14) గోల్కొండ కోటకి ఏమేమి పేర్లు ఉన్నాయి?
ఎ) రాచకొండ కోట
బి) నిర్మల్ కోట
సి) గొల్ల కొండ #
డ) గద్వాల్ కోట
15) గొల్లకొండను ఎవరు నిర్మించారు?
ఎ) శాతవాహనులు
బి) కాకతీయులు #
సి) చాళుక్యులు
డి) కుతుబ్ షాహీలు
16) గోల్కొండ మొదటి పేరేమిటి?
ఎ) చార్మినార్
బి) గోవుల కొండ
సి) మంకాల్ #
డి) పైవేవి కావు
17) గోల్కొండని ఏ సంవత్సరంలో నిర్మించారు?
ఎ) 1140లో
బి) 1145లో
సి) 1141లో
డి) 1143లో #
18) గోల్కొండలో ఎన్ని బురుజులు, ఎంత ఎత్తయిన ద్వారాలు ఉన్నాయి?
ఎ) 85 బురుజులు, 67 అడుగులు
బి) 87 బురుజులు, 69 అడుగులు #
సి) 73 బురుజులు, 65 అడుగులు
డి) 80 బురుజులు, 60 అడుగులు
19) కుతుబ్ షాహీల సమాధులు ఎక్కడ ఉన్నాయి?
ఎ) గోల్కొండ కోటకు దక్షిణంగా
బి) మక్కామసీదుకు ఉత్తరంగా
సి) చార్మినార్ కు దక్షిణంగా
డి) గోల్కొండ కోటకు ఉత్తరంగా #
20) కుతుబ్ షాహీల సమాధుల్లో ఎవరి సమాధి ప్రత్యేకత కలిగి ఉంటుంది?
ఎ) మీర్ ఉస్మాన్ ఆలీకాన్
బి) అలీఖాన్
సి) మహ్మద్ కులీ కుతుబ్ షా #
డి) పైవేవి కావు
21) కుతుబ్ షాహీ సమాధులు ఏ శైలిలో నిర్మించబడ్డాయి?
ఎ) ఇండో-హిందూ
బి) ఇండో-పర్షియన్ #
సి) ఇండో-అరబిక్
డి) ఇండో-రష్యన్
22) ఫలక్ నుమా ప్యాలెస్ ను ఎలా నిర్మించారు?
ఎ) అమెరికా పాలరాతితో
బి) చైనా పాలరాతితో
సి) రష్యా పాలరాతితో
డి) ఇటలీ పాలరాతితో #
23) ఫలక్ నుమా ప్యాలస్ ను ఏ హోటల్ గా మార్చారు?
ఎ) బంజారా హోటల్
బి) పార్క్ హయత్
సి) హెరిటేజ్ హోటల్ #
డి) చౌమహల్లా ప్యాలెస్
24) తారామతి-బారాదరి కల్చరల్ విలేజ్ ఎక్కడ ఉన్నది?
ఎ) రహీంబాగ్
బి) ఇబ్రహీంబాగ్ #
సి) శాంతన్ బాగ్
డి) పైవేవి కావు
25) తారామతి - బారాదరిని ఎవరు నిర్మించారు?
ఎ) మీర్ మెహబుబ్ ఆలీఖాన్
బి) మీర్ ఉస్మాన్ ఆలీఖాన్
సి) ఆలీఖాన్
డి) అబ్దుల్లా కుతుబ్ షా #
26) 1777లో పురానా హవేలి ప్యాలెస్ ఎవరు నిర్మించారు?
ఎ) ఆలీఖాన్
బి) ఔరంగజేబు
సి) రెండో అసఫ్ జా నిజాం అలీ   #
డి) మీర్ ఉస్మాన్ అలీఖాన్
27) పురానా హవేలీ ప్యాలెస్ లో ప్రసిద్ద సందర్శన స్దలాలు ఏమిటి?
ఎ) క్లాక్ టవర్
బి) చెక్క వార్డ్ రోబ్ #
సి) నవాబుల కత్తులు
డి) గోడ గడియారం
28) సాలర్జంగ్ మ్యూజియం ఎక్కడ ఉన్నది?
ఎ) మూసీనదికి ఉత్తరాన
బి) చార్మినార్ కు ఉత్తరాన
సి) మూసీనదికి దక్షిణాన #
డి) గోల్కొండ కోటకు దక్షిణాన
29) భారతదేశంలోని మ్యూజియంలలో సాలర్జంగ్ మ్యూజియం ఎన్నవది?
ఎ) రెండోవది
బి) ఒకటవది
సి) నాలుగవది
డి) మూడవది #
30) మ్యూజియంలోని వస్తువులను ఎవరు, ఎన్నేళ్ళ పాటు సేకరించారు?
ఎ) రెండో సాలర్జంగ్- 20 యేళ్ళ పాటు
బి) మూడో సాలర్జంగ్ - 35 యేళ్ళ పాటు #
సి) ఆలీఖాన్ - 10 యేళ్ళ పాటు
డి) మహమ్మద్ ఆలీఖాన్ - 9 యేళ్ళ పాటు

PANCHAYATI RAJ SYSTEM OF TELANGANA 1

పంచాయతీ రాజ్ వ్యవస్థ -1




( SI/PC/ VRO, జూనియర్ అసిస్టెంట్ల ఉద్యోగాల కోసం గ్రామపంచాతీయ వ్యవస్థపై అందరికీ అవగాహన వచ్చేందుకు వీలుగా పంచాయతీ రాజ్ వ్యవస్థ కు సంబంధించిన ప్రశ్నలు ఇస్తున్నాం )
1) భారత్ లో స్థానిక స్వపరిపాలనా వ్యవస్థలకు జీవం పోసిన బ్రిటీష్ గవర్నర్ జనరల్ ఎవరు ?
ఎ) లార్డ్ రిప్పన్ #
బి) లార్డ్ మెకాలే
సి) బెంటింక్ ప్రభువు
డి) ఎవరూ కాదు
2) బ్రిటీష్ కాలంలో స్థానిక స్వపరిపాలన వ్యవస్థలకు పునరుజ్జీవనం పోసిన చట్టాలు ఏవి ?
ఎ) 1919 భారత ప్రభుత్వ చట్టం
బి) 1935 భారత ప్రభుత్వ చట్టం
సి) 1947 భారత ప్రభుత్వ చట్టం
డి) 1 మరియు 2 #
3) గ్రామీణ ప్రాంతాలను బలోపేతం చేయడం ద్వారా గాంధీజీ కన్న కలలను సాకారం చేయాలని ఎక్కడ ప్రస్తావించారు ?
ఎ) రాజ్యాంగ ప్రకరణలు
బి) ఆదేశిక సూత్రాలు #
సి) ప్రాథమిక హక్కులు
డి) ఏవీ కావు
4) బ్రిటీష్ హయాంలో మొదటి మున్సిపల్ కార్పోరేషన్ ను 1687లో ఎక్కడ ఏర్పాటు చేశారు ?
ఎ) కలకత్తా
బి) బొంబాయి
సి) మద్రాస్ #
డి) పుణె
5) స్థానిక సంస్థల పితామహుడు అని ఎవర్ని అంటారు ?
ఎ) లార్డ్ రిప్పన్ #
బి) లార్డ్ మేయో
సి) లార్డ్ మెకాలే
డి) మెట్ కాఫ్
6) 1946లో తాలూకాలను ఫిర్కాలుగా విభజించి ప్రాంతాల అభివృద్ధికి ఎక్కడ ప్రయత్నాలు జరిగాయి ?
ఎ) మద్రాస్ #
బి) బొంబాయి
సి) కలకత్తా
డి) పుణె
7) స్వాతంత్ర్యం తర్వాత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం 1952లో ప్రవేశపెట్టిన పథకం ఏది ?
ఎ) సమాజ వికాస పథకం
బి) గ్రామీణాభివృద్ధి పథకం
సి) సమాజ అభివృద్ధి పథకం #
డి) ఏదీ కాదు
8) ఆదేశిక సూత్రాల్లో ఎన్నో ప్రకరణల్లో గ్రామపంచాయతీ వ్యవస్థ అమలు చేయాలని ప్రస్తావించారు?
ఎ) ప్రకరణ 30
బి) ప్రకరణ 40 #
సి) ప్రకరణ 50
డి) ప్రకరణ 39
9) 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని ఎప్పుడు కల్పించారు ?
ఎ) 1972
బి) 1982
సి) 1993
డి) 1992 #
10) ఎవరి సలహా మేరకు 1952 అక్టోబర్ 2 నుంచి అమల్లోకి వచ్చిన సమాజ అభివృద్ధి పథకంను అమల్లోకి తెచ్చారు ?
ఎ) వి.టి.కృష్ణమాచారి #
బి) బల్వంత్ రాయ్ మెహతా
సి) అశోక్ మెహతా
డి) ఆచార్య వినోబా భావే
11) 1952 అక్టోబర్ 2 నుంచి అమల్లోకి వచ్చిన సమాజ అభివృద్ధి పథకానికి సహకారం అందించింది ఎవరు ?
ఎ) సేవా గ్రామ్ సంస్థ
బి) ఫోర్డ్ ఫౌండేషన్ #
సి) ఇన్ఫోసిస్
డి) ఏదీ కాదు
12) సమాజ అభివృద్ధి పథకం (1952), సమాజ విస్తరణ పథకం (1953) పనితీరును పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఏది ?
ఎ) అశోక్ మెహతా
బి) దంత్ వాలా కమిటీ
సి) బల్వంత్ రాయ్ మెహతా #
డి) సి.హెచ్ హన్మంతరావు కమిటీ
13) 1957లో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఎన్ని అంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను సిఫార్సు చేసింది ?
ఎ) నాలుగు
బి) మూడు #
సి) రెండు
డి) ఐదు
14) బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఏ రాష్ట్రంలో మొదట స్థానిక వ్యవస్థను అమలు చేశారు ?
ఎ) ఆంధ్రప్రదేశ్
బి) మధ్యప్రదేశ్
సి) గుజరాత్
డి) రాజస్థాన్ #
15) 1959 నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను ఎక్కడ ప్రారంభించింది ?
ఎ) షాద్ నగర్ #
బి) సిద్ధిపేట
సి) గుత్తి
డి) విజయనగరం
16) మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను సమీక్షించి సిఫార్సులు చేయడానికి ఏ కమిటీని ఏర్పాటు చేశారు ?
ఎ) దంత్ వాలా కమిటీ
బి) జి.వి.కె.రావు కమిటీ
సి) అశోక్ మెహతా #
డి) సీహెచ్ హన్మంతరావు కమిటీ
17) 1978 ఆగస్టులో అశోక్ మెహతా కమిటీ ఎన్ని పంచాయతీ రాజ్ వ్యవస్థను సిఫార్సు చేస్తూ 132 సిఫార్సులతో నివేదిక ఇచ్చింది ?
ఎ) మూడు అంచెలు
బి) రెండు అంచెలు #
సి) నాలుగు అంచెలు
డి) ఏవీ కాదు
18) భారతదేశంలో నగర స్థానిక సంస్థలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ?
ఎ) 64వ సవరణ
బి) 72వ సవరణ
సి) 73వ సవరణ
డి) 74వ సవరణ #
19) గ్రామీణ సమాజానికి అత్యధిక అధికారాలు ఎవరి కాలంలో ఉండేవి?
ఎ) బ్రిటిష్
బి) పాండ్య
సి) మొగలులు
డి) చోళులు #
20) మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి రాజ్యాంగంలోని ఏ భాగంలో పేర్కొన్నారు?
ఎ) 9వ భాగం #
బి) 8వ భాగం
సి) మూడో భాగం
డి) 21వ భాగం
21) పంచాయతీరాజ్ వ్యవస్థల గురించి ‘విఫలమైన దేవుడు కాదని, వాటికి సరైన విధులు, నిధులు సమకూరిస్తే విజయవంతంగా పనిచేస్తాయని’ ఎవరు పేర్కొన్నారు ?
ఎ) ఎల్.ఎమ్. సంఘ్వి
బి) బల్వంతరాయ్ మెహతా
సి) అశోక్ మెహతా #
డి) జి.వి.కె రావు కమిటీ
22) మండల వ్యవస్థను మొదట ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది ?
ఎ) ఆంధ్రప్రదేశ్
బి) కర్ణాటక #
సి) రాజస్థాన్
డి) మధ్యప్రదేశ్
23) మండల పరిషత్తులను మొదట ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది ?
ఎ) ఆంధ్రప్రదేశ్ #
బి) కర్ణాటక
సి) రాజస్థాన్
డి) మధ్యప్రదేశ్
24) బ్లాక్ స్థాయిలో ప్రణాళికలను రూపొందించడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఏది ?
ఎ) దంత్ వాలా కమిటీ #
బి) బల్వంతరాయ్ మెహతా
సి) అశోక్ మెహతా
డి) జి.వి.కె రావు కమిటీ
25) గ్రామ పంచాయతీల సర్పంచ్ లను ప్రత్యక్ష పద్దతిలో ఎన్నుకోవాలని సూచించిన కమిటీ ఏది ?
ఎ) దంత్ వాలా కమిటీ #
బి) బల్వంతరాయ్ మెహతా
సి) అశోక్ మెహతా
డి) జి.వి.కె రావు కమిటీ

PANCHAYATI RAJ SYSTEM OF TELANGANA 2

పంచాయతీరాజ్-2



1) 1984లో జిల్లా ప్రణాళికలపై ఏర్పాటు చేసిన కమిటీ ఏది ?
ఎ) సీహెచ్ హన్మంతరావు#
బి) అశోక్ మెహతా
సి) జి.వి.కె.రావు
డి) ఏదీ కాదు
2) జిల్లా కలెక్టర్ లేదా మంత్రి అధ్యక్షతన జిల్లా స్థాయిలో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏది ?
ఎ) సీహెచ్ హన్మంతరావు#
బి) అశోక్ మెహతా
సి) జి.వి.కె.రావు
డి) ఏదీ కాదు
3) 1985లో గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, పరిపాలనా ఏర్పాట్లు అనే అంశం పరిశీలనకు ఏర్పాటైన కమిటీ ఏది ?
ఎ) సీహెచ్ హన్మంతరావు
బి) అశోక్ మెహతా
సి) జి.వి.కె.రావు#
డి) ఏదీ కాదు
4) 1986లో పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం కోసం రాజీవ్ గాంధీ ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది ?
ఎ) బి.ఎల్. సింఘ్వి
బి) జి.వి.కె రావు
సి) 1 మరియు 2
డి) ఎల్.ఎమ్.సింఘ్వి#
5) పంచాయతీ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి వాటిని పరిరక్షించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది ?
ఎ) పి.ఎల్ రావు
బి) ఎల్.ఎం. సింఘ్వి#
సి) సి.హెచ్. హన్మంతరావు
డి) ఎవరూ కాదు
6) పంచాయతీ ఎన్నికల వివాదాల పరిష్కారానికి ప్రత్యేక జ్యుడీషియల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని చెప్పింది ఎవరు ?
ఎ) మహాత్మా గాంధీ
బి) జవహర్ లాల్ నెహ్రూ
సి) ఎల్.ఎం.సింఘ్వి#
డి) అశోక్ మెహతా
7) ఎల్.ఎం.సింఘ్వీ కమిటీ సిఫార్సులతో ఎన్నో రాజ్యాంగ సవరణ బిల్లును 1989లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది ?
ఎ) 64వ#
బి) 69 వ
సి) 73 వ
డి) 74 వ
8) స్థానిక సంస్థలకు సంబంధించి ఎవరు ప్రధానిగా ఉన్నప్పుడు 73 వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది ?
ఎ) రాజీవ్ గాంధీ
బి) పి.వి.నర్సింహారావు#
సి) వి.పి.సింగ్
డి) ఇందిరాగాంధీ
9) నూతన పంచాయతీ రాజ్ వ్యవస్థకు ప్రాణం పోసిన రాజ్యాంగ సవరణ చట్టం ఎన్నవది ?
ఎ) 74 వ
బి) 73 వ#
సి) 64 వ
డి) 65 వ
10) 1992లో పీ.వి.హయాంలో కొత్త పంచాయతీ రాజ్ వ్యవస్థకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. అయితే ఎన్ని రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించాయి ?
ఎ) 20
బి) 18
సి) 17#
డి) 16
11) పంచాయతీ వ్యవస్థకు సంబంధించిన బిల్లుపై సంతకం చేసిన రాష్ట్రపతి ఎవరు ?
ఎ) వి.వి.గిరి
బి) కె.ఆర్. నారాయణన్
సి) జ్ఞానీ జైల్ సింగ్
డి) శంకర్ దయాళ్ శర్మ#
12) దేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ?
ఎ) 1993 ఏప్రిల్ 24#
బి) 1993 ఏప్రిల్ 23
సి) 1994 ఏప్రిల్ 24
డి) 1994 ఏప్రిల్ 23
13) పంచాయతీ రాజ్ వ్యవస్థ నిర్మాణానికి సంబంధించిన వివరణలు రాజ్యాంగంలోని ఏ భాగంలో పొందుపరిచారు ?
ఎ) 11 వ
బి) 10వ
సి) 9వ#
డి) ఏదీ కాదు
14) ఏ రోజును పంచాతీయ రాజ్ దినోత్సవంగా జరుపుకుంటారు ?
ఎ) ఏప్రిల్ 23
బి) ఏప్రిల్ 24#                                                                                                                                                                                                           సి) అక్టోబర్ 2
డి) నవంబర్ 26
15) పంచాయతీలు నిర్వహించాల్సిన ఎన్ని విధుల గురించి 11వ షెడ్యూల్ లో ఉన్నాయి ?
ఎ) 19
బి) 39
సి) 49
డి) 29#
16) పంచాయతీ రాజ్ చట్టంనకు సంబంధించి ఈ కిందివాటిలో సరైనది ఏది ?
1) 73 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడింది
2) 11వ షెడ్యూల్ లో పంచాయతీల విధుల గురించి ఉంది
3) పంచాయతీ రాజ్ చట్టాన్ని మొదటగా రూపొందించిన రాష్ట్రం కర్ణాటక
4) పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
ఎ) 1,2,3,4
బి) 1,2,3 #
సి) 1,2 మాత్రమే 3,4 కాదు
డి) 1 తప్ప మిగిలినవన్నీ కరెక్టే
17) 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏర్పడిన పంచాయతీరాజ్ చట్టంలో గ్రామసభల గురించిన ప్రస్తావన రాజ్యాంగంలో ఏ ప్రకరణలో కన్పిస్తుంది ?
ఎ) 243 ఎ #
బి) 243 బి
సి) 243 సి
డి) 243 డి
18) ప్రతి రాష్ట్రంలో 3 అంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పే అధికరణం ఏది ?
ఎ) 243 ఎ
బి) 243 సి
సి) 243 బి #
డి) 243 డి
19) 243 డీ ప్రకరణ ప్రకారం పంచాయతీల్లో మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలి ?
ఎ) 50శాతం
బి) 1/6
సి) 1/9
డి) 1/3 #
20) పంచాయతీల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు ఉండాలని ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఏది ? (ఈ సవరణ బిల్లుకు ఆమోదం లభించలేదు)
ఎ) 73
బి) 74
సి) 110 #
డి) 111
21) 110 రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంటులో అనుమతి లభించనప్పటికీ దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో పంచాయతీల్లో మహిళలకు 50శాతం కోటా ఉంది ?
ఎ) 10#
బి) 11
సి) 12
డి) 23
22) పంచాయతీల పదవీ కాలానికి సంబంధించి ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ ?
1) పంచాయతీల పదవీ కాలం 5 యేళ్ళు
2) పదవీకాలానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయొచ్చు
3) మధ్యలో రద్దయితే ఏడాది లోపు ఎన్నికలు పూర్తి చేయాలి
4) పదవీకాలం 6 నెలల కంటే తక్కువగా ఉంటే ఉప ఎన్నికలు జరపనక్కర్లేదు
ఎ) 1,2,3
బి) 1,2,4 #
సి) 1.2,3,4
డి) 1, 2 మాత్రమే 3, 4 కాదు
23) పంచాయతీ సభ్యుల అనర్హతలకు సంబంధించి ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ ?
1) సభ్యుడి వయసు 21 యేళ్ళ కంటే తక్కువ ఉంటే
2) అధికార దుర్వినియోగానికి పాల్పడితే
3) ఏపీ, తెలంగాణలో 1995 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉంటే
4) స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి రాజస్థాన్ కనీస అర్హత నిర్ణయించింది
ఎ) 1,2,3,4 #
బి) 1,2,3 మాత్రమే
సి) 1,2 మాత్రమే 3,4 కాదు
డి) 2,3,4 మాత్రమే
24) గ్రామపంచాయతీల్లో వార్డుల సంఖ్యను ఎలా నిర్ణయిస్తారు ?
ఎ) పంచాయతీ ఓటర్లు
బి) పంచాయతీలో SC/ST/OBC ఓటర్లు
సి) పంచాయతీ జనాభా #
డి) మండల జనాభా ఆధారంగా 1/3 వ వంతు
25) పంచాయతీ రాజ్ వ్యవస్థపై అశోక్ మెహతా కమిటీని నియమించినప్పుడు భారత ప్రధాని ఎవరు ?
ఎ) మెరార్జీ దేశాయ్ #
బి) ఇందిరా గాంధీ
సి) రాజీవ్ గాంధీ
డి) జవహర్ లాల్ నెహ్రూ

TELANGANA DIALECTS OF AGRICULTURE & REVENUE

తెలంగాణ మాండలికాలు (వ్యవసాయం & రెవెన్యూ పదాలు)

(నోట్: ఇటీవల కాలంలో జరిగిన అన్ని TSPSC ఎగ్జామ్స్ లోనూ తెలంగాణ మాండలికాలు, తెలంగాణలో వాడుకలో ఉన్న పదాల మీద ప్రశ్నలు వచ్చాయి. అందువల్ల ప్రతి అభ్యర్థికి వీటి మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశ్యంతో కొన్ని ముఖ్యమైన పదాలను మీకు పరిచయం చేస్తున్నాం. మన తెలంగాణకి ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి 24 కిలోమీటర్లకు మాండలికం మారిపోతుంది. ప్రతి జిల్లాకు ప్రత్యేకమైన మాండలికం ఉన్నట్టు భాషా నిపుణులు చెబుతున్నారు. )

ఈ చాప్టర్ లో మీకు వ్యవసాయం, రెవెన్యూ సంబంధిత పదాలను పరిచయం చేస్తున్నాం... TSPSC గ్రూప్ పరీక్షలు, పోలీస్ ఉద్యోగాలతో పాటు VRO ఉద్యోగాలకు తప్సనిసరిగా పనికొస్తాయి.

1) వ్యవసాయం - ఎవుసం
2) యాసంగి - రబీ పంట
3) ఖరీఫ్ - వర్షా కాలం పంట
4) తరి - సాగు భూమి ( వెట్ )
5) ఖుష్కీ - డ్రై ( మెట్ట ప్రాంతం)
6) తైబందీ - రెండో పంట
7) గెట్టు - పొలం హద్దులు
8) మొగులు - ఆకాశం మబ్బులు పట్టడం
9 ) అరక - నాగలి
10) పొక్కు/పార - మట్టి తీసేది
11) గరిశె - వడ్లు నిల్వ చేసేది
12) అంగ - అడుగు
13) అగ్గువ - రేటు తక్కువ లేదా చౌక అయినది
14) ప్రియం - రేటు ఎక్కువ
15) జడ్డిగం - జొన్న సాలులో విత్తనాలు నాటేందుకు నాగలికి కట్టేది
16) కాణి - రెండు ఎడ్ల మెడల వేసే చెక్క కొయ్య
17 ) కౌల్దార్ - భూమిని కౌలుకి తీసుకునేవాడు
18) ముల్లుగర్ర - దాదాపు నాలుగైదు మూరలు ఉండే పొడవాటి కర్ర. దీనికి చివర ఇనుప మొల (మేకు) ఉంటుంది. ఎడ్లను అదిలించడానికి ఉపయోగిస్తారు.
19) వడిశెల - పొలాల్లో పిట్టలు రాకుండా తాడులో రాయి ఉంచి విసిరేది
20) కొట్టం - పశువులను ఉంచేది
21) అల్పటి - దాపటి = ఎడమ, కుడి (సాధారణంగా బండికి కట్టే ఎడ్లను ఉదహరిస్తారు )
22) శేర్ దార్ - పెద్ద జీతగాడు
23) కమతం - భూమి విస్తీర్ణం
24) ఫౌతి - చనిపోయిన వారి వివరాలు నమోద
25) ఇలాకా - ప్రాంతం
26) తూము - చెరువుల నుంచి కాలువలకు నీటిని వదిలేది
27) మత్తడి - చెరువు నిండిన తర్వాత బయటకు వచ్చే నీరు
28) అలుగు - మత్తడి నుంచి పైకి వచ్చే నీరు
29) మడువ - చిన్న కాలువ నుంచి పొలాల్లోకి నీటిని వదిలేది
30) మాల్గుజారీ - భూమిశిస్తు వసూళ్ళు
31) పోరంబోకు - సాగుకు పనికిరాని భూమి
32) బంచరాయి - పశువుల ఆహారం కోసం వదిలిన ప్రభుత్వ భూమి
33) ఇనాం - ప్రభుత్వం సేవలు గుర్తించి ఇచ్చే భూమి
34) వేవళ్ ఇనాం - దేవుడి గుడిలో ధూప దీప నైవేద్యాలు చేసేందుకు ఇచ్చేది
35) బలోతా ఇనాం - భూమిలేని నిరుపేదలైన దళిత వర్గాలకు ఇచ్చేది (ఈ భూమిని అమ్మకూడదు, కొనకూడదు)
36) సర్ఫేఖాస్ - నిజాం నవాబు సొంత భూమి
37) సీలింగ్ - భూ గరిష్ట పరిమితి
38) ఏక్ ఫసల్ - ఒక పంట
39) రెవెన్యూ ఫిర్కా - ఒక నిర్ధేశిత రెవెన్యూ ప్రాతం
40) గిర్దావర్ హల్కా - నిర్దేశిత మండల ప్రాంతం
41) ట్రెజరీ - రాష్ట్ర ఖజానా
42) టంకశాల - నాణేలు ముద్రించే కేంద్రం
43) అర్జీ - దరఖాస్తు
44) శిస్తు - ట్యాక్స్
45) ఫసలీ - ఉర్దూ కేలండర్ సంవత్సరం (ఇది క్రీస్తుకు 590 సంవత్సరాల తర్వాత ఏర్పడింది. ఇప్పటికీ రెవెన్యూలో ఏడాదికేడాది ఫసలీ సంవత్సరాన్ని గుర్తిస్తారు )
46) పుల్లర - ప్రభుత్వ భూముల్లో పశువులను మేపితే చెల్లించాల్సిన పన్ను (ఫారెస్ట్ వాళ్ళకి ఉండేది)
47) సర్వే నెంబర్ - భూములను గుర్తించే నెంబర్
48) అడంగల్ - పహణీ
49) పావుతీ - రశీదు పుస్తకం
50) నక్షా - భూముల వివరాలు తెలిపే చిత్ర పటం (మ్యాప్ )
51) కబ్జాదార్ - భూమిని తన ఆధీనంలో ఉంచుకొని అనుభవించే వ్యక్తి
52) చౌఫస్లా - రైతుకి గ్రామంలో వేర్వేరు పంట భూములుంటే వాటిని ఒకే దగ్గర రాసే పుస్తకం ( రెవెన్యూ లెక్కల్లో గ్రామ లెక్క నెంబర్.4)
53) పైసల్ పట్టీ - భూమికి శిస్తు నిర్ణయించిన పుస్తకం
54) గోష్వారా - భూముల స్వభావం బట్టి పన్ను వసూలు కోసం, రైతుల పట్టా మార్పు వివరాలు నమోదు చేసే రిజిష్టర్
55) సేత్వార్ - సర్వే సెటిల్మెంట్ రిజిష్టర్ ( చివరిసారిగా 1964లో)
56) పాస్ బుక్ - రైతుకి భూమిపై యాజమాన్య హక్కులు గుర్తిస్తూ నమోదు చేసే పుస్తకం
( ROR కింద రెవెన్యూ శాఖ రిజిస్టర్లలో నమోదు చేయించుకున్న వారికి వీటిని ఇస్తారు )
57) గెజిట్ - రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించే అధికారిక పత్రం
58) చలానా - ప్రభుత్వానికి చెల్లించేందుకు ఉపయోగించే ఫాం
59) ఖాస్రా పహణీ - 1954-55 సెటిల్ మెంట్ తర్వాత జారీ అయిన భూమి హక్కుల రికార్డు
60) జమాబందీ - ఏడాదికి ఒకసారి భూమి శిస్తు ఆదాయ వ్యయాలను లెక్కపెట్టేది
61) తాలూక్ దార్ - జిల్లా కలెక్టర్
62) తహసిల్దార్ - మండల రెవెన్యూ అధికారి ( MRO)
63) నాయబ్ సాబ్ - డిప్యూటీ తహసిల్దార్
64) గిర్దావర్ - రెవెన్యూ ఇన్సెపెక్టర్ ( RI)
65) పటేల్ - గ్రామాధికారి ( VRO )
66) పట్వారీ - ప్రభుత్వం తరపున గ్రామంలో భూమి కొలతలు, పట్టాలు, శిస్తు రికార్డులు నిర్వహించే వ్యక్తి (కరణం )
67) మాలీ పటేల్ - గ్రామంలో రెవెన్యూ శిస్తులు వసూలు చేసేవారు
68) పోలీస్ పటేల్ - గ్రామంలో లా అండ్ ఆర్డర్ చూసేవారు
69) షేక్ సింధీ - సుంకరి, ఎలోడు ( రెవెన్యూ అసిస్టెంట్ - VRA)
70) నీరడి - గ్రామంలో సాగునీటిని విడుదల చేయడం, చెరువులు, ఇతర కాలువల నీటి యాజమాన్యం నిర్వహించేవాడు
71) పట్టాదారు - భూమి మీద యాజమాన్య హక్కుల కలవాడు
72) ఖాస్తు దారు - భూమిని అనుభవించే వారు

DIALECTS (మండలికాలు) OF TELANGANA

మండలికాలు

1) గట్క - జొన్న అన్నం
2) సందూక్ - పెట్టె
3) జిమ్మెదారి - బాధ్యత
4) గోలెం - గాబు
5) పటువ - మట్టికుండ
6) పబ్బతి - దండం
7) ఇనాం - లంచం
8) అంగి - చొక్క
9) శెత్తిరి - గొడుగు
10) రువ్విడి - సాక్ష్యం
11) ముత్తెంత - కొంచం
12) గమ్మతి - వింత
13) ఎటమటం - సక్రమంగ లేకపోవుట
14) పుంటికూర - గొంగూర
15) గోస - కష్టం
16) తోఫా - కానుక
17) గెంటీలు - కర్ణాభరణాలు
18) జిమ్మలు - చేపలు
19) ఎవుసం - వ్యవసాయం
20) జల్ది - తొందరగా
21) కందీలా - లాంతరు
22) పతార - పలుకుబడి
23) ఇలాక - ప్రాంతం
24) పేచి - కొట్లాట
25) పికరు - విచారం
26) ఉసికె - ఇసుక
27) బందూక్ - తుపాకి
28) తొవ్వ - దారి
29) తైదలు - రాగులు
30) దబ్బున - వెంటనే
31) సోయి - తెలివి
32) అరిగోస - పెద్దకష్టం
33) సాకుత - పోషించుట
34) ఇగురం - నైపుణ్యం
35) గడ్డపార - గునపం
36) పిరం - ఎక్కువధర
37) సమ్మతి - ఇష్టం
38) ఇజ్జతి - గౌరవం
39) భవంతి - భవనం
40) గిలాస - గ్లాస్
41) పగటీలి - మధ్యాహ్నం
42) మక్కలు - మక్కజోన్నలు
43) గుగ్గిళ్లు - ఉడికించిన గింజలు
44) గత్తర - కలరా
45) లొట్ టి - కల్లుకుండ
46) ఖచ్చీరు - పోలీస్ స్టేషన్
47) పగోళ్లు - శత్రువులు
48) ముల్కీ - స్థానికులు
49) అర్ ర - చిన్న గది
50) గోలిచ్చుట - వేపుట
51) పయ్ య - చక్రం

TELANGANA PINDIVANTALU

పిిండివంటలు


1) బూరెలకు గల ఇంకొక పేరు ఏమిటి ?
జ: పోలెలు
2) జోన్న గటుకకు గల ఇంకొక పేరు ఏమిటి ?
జ: సంకటి
3) గూగిళ్లను తెలంగాణాలో ఏ పేరుతో పిలుస్తారు ?
జ: గుడాలు
4) మల్లీద ముద్దలకు గల ఇంకొక పేరు ఏది ?
జ: సజ్జముద్దలు
5) సజ్జముద్దలను తెలంగాణాలో ఏ పండుగనాడు చేస్తారు ?
జ: బతుకమ్మ పండుగ
6) అంబలి వేటితో తయారు చేస్తారు ?
జ: జొన్నలు, రాగులు, సజ్జలపిండి, రవ్వ
7) తెలంగాణాలో ప్రసిద్ధి పొందిన బిర్యాని ఏది ?
జ: హైదరాబాద్ బిర్యాని
8) జొన్నరొట్టె వేటితో తయారు చేస్తారు ?
జ: ఎర్రజొన్నలు, తెల్లజొన్నలు, పచ్చిజొన్నలు
9) శకినాలు ఎప్పుడు తయారు చేస్తారు ?
జ: సంక్రాంతి
10) తెలంగాణాలో బియ్యం పిండిని ఏ పేరుతో పిలుస్తారు ?
జ: సర్వపిండి
11) మడుగులు ఏ పండుగనాడు తయారుచేస్తారు ?
జ: వినాయకచవితి
12) తెలంగాణాలో బొంగులను ఏ పేరుతో పిలుస్తారు ?
జ: మరమరాలు
13) అరిసెలు గల మరొక పేరు ఏమిటి ?
జ: అత్రసలు
14) తెలంగాణాలో కజ్జికాయలను ఏమని పిలుస్తారు ?
జ: గర్జలు
15) పులిహోరకు గల ఇంకొక పేరు ?
జ: చిత్రంగం
16) పలావ్ గల ఇంకొక పేరు ?
జ: భగారన్నం
17) బక్షాలు గల ఇంకొక పేరు ఏది ?
జ: పొలేలు
18) సంకటిని ఎలా తయారు చేస్తారు ?
జ: జొన్న నూకలు ఉడికించి
19) కొర్రలతో ఏమేమి చేస్తారు ?
జ: పాయసం
20) జిల్కర్లు అని వేటిని అంటారు ?
జ: చేతితో చేసిన సేమియాలు

PROJECTS IN TELANGANA

 తెలంగాణ ప్రాజెక్టులు – QUICK REVISION



1) నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ :

ఈ ప్రాజెక్టుని నల్లగొండ జిల్లాలోని నందికొండ గ్రామం దగ్గర నిర్మించారు.
1955, డిసెంబర్ 10న ప్రారంభమైంది.
నాగార్జున సాగర్ డ్యామ్ పొడవు 1500 మీ ఉండగా ఎత్తు 124 మీ.
ఈ ప్రాజెక్టు పరివాహక ప్రాంతం 2.15 లక్షల చదరపు కిలోమీటర్లు
దీనికి కింద 10 లక్షల ఎకరాలకుపైగా సాగవుతుంది.

2) శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు

దీన్ని నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు దగ్గర గోదావరి నదిపై నిర్మించారు.
ఈ ప్రాజెక్టుకి 1963లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు.
1978లో నిర్మాణం పూర్తయింది. అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టు కింద 16.5 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి.

3) ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు

కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్ట్ ఇది
జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని రావులపల్లి దగ్గర నిర్మించారు. 11 టీఎంసీల సామర్థ్యంతో 1984లో ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది.
ఈ ప్రాజెక్టు ఎడమ కాలుని ఎన్టీఆర్ కాలువ అంటారు. దీని కింద 26,103 హెక్టార్లు సాగవుతుంది
కుడి కాలువని నల్ల సోమాద్రి కాలువ అంటారు. దీని కింద 15,257 హెక్టార్లు సాగవుతున్నాయి.
ప్రియదర్శిన జూరాల ప్రాజెక్టు ద్వారా 221.40 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.

4) కాళేశ్వరం ఎత్తిపోతల పథకం

ఈ ప్రాజెక్టును గోదావరి నదిపై నిర్మిస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం దగ్గర నిర్మాణం జరుగుతోంది.
కాళేశ్వరం కింద 45వేల ఎకరాల ఆయకట్టు ఉంది

5) నిజాం సాగర్

నిజాం సాగర్ ను మంజీర నదిపై నిర్మిస్తున్నారు
సంగారెడ్డి జిల్లాలోని బంజపల్లి దగ్గర నిర్మాణం జరుగుతోంది.
1923లో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆదేశాలతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు.
1931లో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. నవాబ్ అలీ నవాజ్జంగ్ బహదూర్ ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పర్యవేక్షించారు. ( ఈయన పేరుతోనే తెలంగాణ ఇంజనీర్స్ డే ని నిర్వహిస్తున్నారు )
58 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా 2.31 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది.

6) రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్)

RDS ప్రాజెక్టును తుంగభద్రా నదిపై నిర్మించారు.
కర్ణాటకలోని రాయచూర్ జిల్లా మన్ని తాలూకాలోని రాజోలిబండ దగ్గర ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది.
ప్రాజెక్టును నిజాం కాలంలో 1946లో ప్రారంభించారు. 1958లో పూర్తయింది.
ప్రాజెక్టు నీటిని గద్వాల, అలంపూర్ మండలాల్లో 75 గ్రామాలకు అందిస్తున్నారు.

7) లోయర్ మానేర్ డ్యామ్

LMD కరీంనగర్ జిల్లాలోని గోదావరి నది ఉపనది అయిన మానేరు నదిపై నిర్మించారు.
1985లో ఈ డ్యామ్ నిర్మాణం పూర్తయింది.

8) సింగూరు ప్రాజెక్టు

సింగూరు ప్రాజెక్టును సంగారెడ్డి జిల్లా సింగూరు గ్రామం దగ్గర నిర్మించారు.
30 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టుతో 40వేల ఎకరాలు సాగవుతున్నాయి
సింగూరు ప్రాజెక్టు ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.

9) దేవాదుల ఎత్తిపోతల పథకం

దీన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాలంపేట దగ్గర నిర్మించారు.
దేవాదుల ఆయకట్టు 6.21 లక్షల ఎకరాలు

10) సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్

-ఈ ప్రాజెక్టును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండంలోని రాళ్లపాడు దగ్గర నిర్మిస్తున్నారు.
-2016, ఫిబ్రవరి 16న సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.
-50 టీఎంసీల గోదావరి నీటిని ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోస్తారు.

11) మూసీ ప్రాజెక్టు

నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలో మూసీ నదిపై నిర్మించారు.
ప్రాజెక్టు 1954లో ప్రారంభమైంది. 1961లో పూర్తయింది.
మూసీ ప్రధాన కాలువ 64 కి.మీ.
ప్రాజెక్టు కింద 30 వేల ఎకరాల ఆయకట్టు ఉంది.

12) నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం

జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని ఉప్పేరు దగ్గర ఉంది.
ఈ పథకానికి 2005లో శంకుస్థాపన జరిగింది. ఆయకట్టు 2 లక్షల ఎకరాలు.

13) మరికొన్ని ప్రాజెక్టులు

1) కంతానపల్లి సుజల స్రవంతిని గోదావరి నదిపై నిర్మిస్తున్నారు. ఇది జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో ఉంది
2) అలీసాగర్ ప్రాజెక్టును గోదావరి నదిపై నిర్మిస్తున్నారు. ఇది నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో ఉంది.
3) గుత్ప ఎత్తిపోతల పథకం (ఆర్గు రాజారామ్) ను గోదావరి నదిపై నిర్మిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడ దగ్గర ఉంది.
4) కడెం రిజర్వాయర్ నిర్మల్ జిల్లాలోని కడెం మండలం పెద్దూరు గ్రామం దగ్గర నిర్మించారు.
5) కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ మహబూబ్ నగర్ జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టుపై 1954లో నిర్మించారు. దేవరకద్ర మండలం బొల్లారం దగ్గర ఉంది. దీంతో 50వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతున్నాయి

Thursday 6 September 2018

అసెంబ్లీ రద్దుతో నోటిఫికేషన్లు ఆగుతాయా ?

రాష్ట్రంలో అసెంబ్లీ రద్దయింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆపద్దర్మ ప్రభుత్వం కొనసాగుతోంది... ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నడుస్తున్న నోటిఫికేషన్ల సంగతేంటి ... ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొనసాగుతాయా... వాటిని రద్దు చేస్తారా... రిజల్ట్స్ ఇస్తారా... కొత్త వాటి పరిస్థితి ఏంటి... ఇది నిరుద్యోగులను ఇబ్బంది పెడుతున్న ప్రశ్నలు. రాబోయే ఎగ్జామ్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న చాలామంది నిరుద్యోగులకు చదవాలో... వద్దా... అర్థం కాని సందిగ్దంలో పడ్డారు. ఈ డౌట్స్ ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తోంది... తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్ సైట్.
అసెంబ్లీ రద్దు తర్వాత ఆపద్దర్మ ప్రభుత్వం నడుస్తోంది. కొత్త నోటిఫికేషన్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఈ ప్రభుత్వానికి ఉండదు కాబట్టి ... కొత్త కొలువులకు ప్రకటనలు వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. అయితే ఇప్పటికే నోటిఫికేషన్లు రిలీజ్ చేసి... ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకటించినవి కొనసాగే అవకాశాలున్నాయి. వీటిని రద్దు చేయరు.
అంటే ప్రస్తుతం ఈ కింది నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి
1) ఈనెలలో వీఆర్వో ఎగ్జామ్
2) నెలాఖరులో జరిగే పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు
3) వచ్చే నెలలో జరిగే గ్రూప్ - 4 పరీక్షలు
4) ఇప్పటికే టైం టేబుల్ ప్రకటించిన గురుకుల పరీక్షలు
5) ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయిన జూనియర్ పంచాయతీ రాజ్ కార్యదర్శుల పోస్టులు
ఈ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్స్ యధావిధిగా జరిగే అవకాశాలున్నాయి. అయితే ఫైనల్ రిజల్ట్స్ మాత్రం పెండింగ్ లో పెట్టే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఎన్నికలు నవంబర్ 2018 లో జరిగితే డిసెంబర్ లో రిజల్ట్స్ వచ్చే ఛాన్సుంది. అప్పటి వరకూ ఉద్యోగాలపై తుది నియామకాలు గానీ, ఫలితాల ప్రకటన కానీ ఉండే అవకాశం లేదు. గతంలో గ్రూప్ - 2 విషయంలోనూ ఇదే జరిగిందని అప్పట్లో ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయిన వారు చెబుతున్నారు.
ఇప్పటికే పూర్తయిన సబ్ ఇన్సెపెక్టర్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాలు కూడా వెల్లడించే అవకాశముంది. అభ్యర్థుల శారీరక దారుఢ్య పరీక్షలు, ఫైనల్ ఎగ్జామ్ కి కూడా ఎలాంటి ఆటంకం ఉండకపోవచ్చు. కానీ తుది ఫలితాలు, నియామకాలను తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు పెండింగ్ లో పెట్టే అవకాశముంది.
ఇక ఆర్థిక శాఖ అనుమతించిన గ్రూప్ - 1 తో పాటు ఇతర పోస్టులపై మాత్రం నోటిఫికేషన్లు కొత్తగా వెలువడే ఛాన్స్ లేదు. ఆర్థికశాఖ అనుమతించినా... TSPSC వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదని అంటున్నారు.
సో ... ప్రస్తుతం VRO/PC/GR.IV/ SI Mains / Gurukula Exams/ జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు ప్రిపేర్ అయ్యేవారు ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దని మనవి. ఎగ్జామ్స్ యధావిధిగా జరుగుతాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

Tuesday 4 September 2018

JOBS IN TELANGANA AYUSH DEPARTMENT

తెలంగాణ ఆయుష్ శాఖలో 117 ఖాళీలు...

తెలంగాణ ప్రభుత్వ ఆయుష్ శాఖ ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

-మొత్తం ఖాళీలు- 117
-మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద)-62 ఖాళీలు
(జోన్ V-20, జోన్ VI-42)
-మెడికల్ ఆఫీసర్ (హోమియో)-36 ఖాళీలు (జోన్ V-14, జోన్ VI-22)
-అర్హత: పై రెండు పోస్టులకు గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఆయుర్వేదం/హోమియోపతిలో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు మెడికల్ ప్రాక్టీషనర్‌గా శాశ్వత సభ్యత్వం ఉండాలి.
-పే స్కేల్: రూ. 37,100-91,450/- (పై రెండు పోస్టులకు)
-లెక్చరర్ (హోమియో)-11 ఖాళీలు (జేఎస్‌పీఎస్ గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్ రామంతపూర్)
-లెక్చరర్ (యునాని)-8 ఖాళీలు (గవర్నమెంట్ నిజామియా టీబీ కాలేజ్ హైదరాబాద్)
-అర్హత: పై రెండు పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హోమియో/యునాని విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు మెడికల్ ప్రాక్టీషనర్‌గా శాశ్వత సభ్యత్వం ఉండాలి.
-పే స్కేల్: రూ. 35,120-87,130 (పై రెండు పోస్టులకు)
-గమనిక: పాత 10 జిల్లాల ప్రకారం జోన్ V (ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం), జోన్ VI (రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ) లోని ప్రాంతాల్లో ఈ పోస్టులను భర్తీచేస్తారు.
-వయస్సు: 18 నుంచి 43 ఏండ్ల మధ్య ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 600/-
-ఎంపిక: అకడమిక్ మార్కులు, పని అనుభవం
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 5
-చివరితేదీ: సెప్టెంబర్ 15
-వెబ్‌సైట్: https://ayushrect2018.telangana.gov.in

FREE COACHING FOR PANCHAYAT SECRETARY




 తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌లో పంచాయతీ కార్యదర్శుల పోస్టుల పరీక్షకు ఉచిత శిక్షణకై అర్హులైన బీసీ, ఇబీసీ, ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేయడానికి tsbcstudycircles.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారం, పూర్తి నోటిపికేషన్ లభిస్తాయని పేర్కొన్నారు. దరఖాస్తు ఆన్‌లైన్ ద్వారా నోటిఫికేషన్‌లో 5-9-2018 నుంచి 12-9-2018లోగా రిజిష్టర్ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకునే గ్రామీణ ప్రాంత అభ్యర్థులు కుటుంబ వార్షిక ఆదాయం రూ. 1.5 లక్షలు మించకూడదని తెలిపారు. పట్టణ ప్రాంతానికి చెందిన అభ్యర్థులు ఆదాయం రూ. 2 లక్షలు మించవద్దన్నారు. ఎంపికైన అభ్యర్థులకు సంబంధిత జిల్లాలైన హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, సంగారెడ్డి, సిద్దిపేటలలో పది బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు