Monday 27 August 2018

PANCHAYATHI SECRETARY RECRUITMENT PROCESS

పంచాయతీ కార్యదర్శుల నియామకానికి విధివిధానాలు




హైదరాబాద్‌: తెలంగాణలో పంచాయతీ కార్యదర్శుల నియామక విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శాఖాపరమైన ఎంపిక కమిటీ ద్వారా భర్తీ ప్రక్రియకు అనుమతిచ్చిన నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. ఖాళీలకు అనుగుణంగా 30 జిల్లాల వారీగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామక పరీక్ష నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు కొత్త రోస్టర్ చేపట్టాలని కూడా ఆదేశించారు. డిగ్రీ విద్యార్హతతో ఈ నియామకాలు చేపడతారు. అభ్యర్థులు 18 నుంచి 39 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో 150 మార్కుల చొప్పున రెండు పేపర్లలో జనరల్ నాలెడ్జ్, కొత్త పంచాయతీ రాజ్ చట్టం, స్థానిక పరిపాలన, గ్రామీణాభివృద్ధి, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రభుత్వ కార్యక్రమాలు తదితర అంశాలపై పరీక్ష నిర్వహిస్తారు. జేఎన్టీయూ, పోలీసు నియామక సంస్థ, గురుకుల నియామక సంస్థ లేదా ఇతర నియామక సంస్థల ద్వారా నియామకాలు చేపట్టవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది

No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు